తెలుగుదేశం రాష్ట్ర అధికార ప్రతినిధి మేడా విజయ్ శేఖర్ రెడ్డి నేతృత్వంలో పసుపు జెండాకు గౌరవ వందనం

Spread the love

ప్రజల ఆశయాలకు అద్దం పట్టే, పార్టీ శక్తిని ప్రదర్శించే వేదికగా కడప మహానాడు 2025 నిలిచింది. ఈ మహానాడును పురస్కరించుకొని, తెలుగుదేశం పార్టీ మరింత బలోపేతం కావడమే కాకుండా, రాష్ట్ర భవిష్యత్తుకు దిశానిర్దేశం చేస్తోంది.

తెలుగుదేశం పార్టీ అంటే పరిపాలనలో నాణ్యత, అభివృద్ధికి చిరునామా, ప్రజల అభిమానం కలిగిన రాజకీయ దిశ. ఈ విలువలకు నిలువెత్తు ప్రతీకలు నారా చంద్రబాబు నాయుడు గారు మరియు నారా లోకేశ్ గారు.
నారా చంద్రబాబు నాయుడు గారు తిరిగి ముఖ్యమంత్రిగా ఎన్నికవ్వడం రాష్ట్రానికి వెలకట్టలేని ఆశీర్వాదం.
ఆయన దూరదృష్టి, అనుభవం, అభివృద్ధి పట్ల ఉన్న అంకితభావం రాష్ట్రాన్ని మళ్లీ గోల్డెన్ ఏజ్ వైపు తీసుకెళ్లే మార్గాన్ని సిద్ధం చేస్తోంది.
ఇటు నారా లోకేశ్ గారు యువతలో ఆశాజ్యోతిగా, విజన్‌తో కూడిన, శ్రద్ధ గల నాయకుడిగా వెలుగొందుతున్నారు.
ప్రజల పట్ల ఉన్న నిబద్ధత, యువత పట్ల ఉన్న నమ్మకం, శ్రమతో కూడిన నాయకత్వం ఆయనను పార్టీ భవిష్యత్తుకు నిలువెత్తు ఆధారంగా నిలిపేస్తోంది.

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ మెడ విజయ్ శేఖర్ రెడ్డి గారు నాయకత్వంలో రాజంపేట నియోజకవర్గం నుండి వేలాది మంది కార్యకర్తలు మహానాడుకు హాజరై, పార్టీకి తమ మద్దతును ప్రకటించడానికి సిద్ధమవుతున్నారు.

కడప మహానాడు 2025ను ఘన విజయంగా నిలిపిద్దాం!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *