దంపతుల మధ్య చెలరేగిన ఘర్షణ ఇద్దరు నిండు ప్రాణాలు తీసింది.
తమ అక్కతో గొడవ పడుతున్నాడని.. బావపై ఇద్దరు బావమర్దులు గొడవకు దిగారు.
అ సంఘటన పెద్ద ఘర్షణగా మారింది.
చివరికి బావ, తన ఇద్దరు బావమర్దులను హత్య చేశాడు.
ఈ దారుణ ఘటన
అల్లూరి సీతారామరాజు జిల్లా ( నవ్యాంధ్ర న్యూస్ )
జీకే విధి మండలం చింతపల్లి క్యాంపులో చోటు చేసుకుంది.
కిముడు కృష్ణ, కిముడు రాజులను వాళ్ల బావ గెన్ను ఒకేసారి ఇద్దరినీ శూలంతో పొడిచి హత్య చేశాడు.
ఈ ఘర్షణను అడ్డుకోబోయిన మరో వ్యక్తికి కూడా గాయాలు అయ్యాయి.
మృతదేహాలను పోస్టుమర్టం నిమిత్తం సీలేరు ఆసుపత్రికి తరలించారు.
గాయపడిన వ్యక్తి కేజీహెచ్లో చికిత్స పొందుతున్నాడు.
ఈ ఘటనపై పోలీసుల విచారణ లో మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

