గుంటూరు ( నవ్యాంధ్ర న్యూస్ ) రాం ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం… 2024-25 విద్యా సంవత్సరానికి ప్రభుత్వ పాలిటెక్నిక్, అనుంబంధ పాలిటెక్నిక్ లో కింది నాలుగు డిప్లొమా ప్రోగ్రామ్లు అందిస్తోంది. అర్హులైన పదో తరగతి ఉత్తీర్ణులు ఆన్లైన్లో జూన్ 16లోగా దరఖాస్తు చేసుకోవాలి.
ప్రోగ్రామ్, సీట్ల వివరాలు:
- డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ (రెండేళ్లు) సీట్లు: ప్రభుత్వ- 578; అనుబంధ- 1420.
- డిప్లొమా ఇన్ సీడ్ టెక్నాలజీ (రెండేళ్లు) సీట్లు: ప్రభుత్వ- 25; అనుబంధ – 120
- డిప్లొమా ఇన్ ఆర్గానిక్ అగ్రికల్చర్ (రెండేళ్లు) సీట్లు: ప్రభుత్వ- 25; 0
- డిప్లొమా ఇన్ అగ్రికల్చరల్ ఇంజినీరింగ్ (మూడేళ్లు) సీట్లు: ప్రభుత్వ- 60; అనుబంధ – 150
మొత్తం సీట్లు: ప్రభుత్వ- 688; అనుబంధ – 1690.
బోధనా మాధ్యమం: ఇంగ్లిష్.
అర్హత: పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి
వయోపరిమితి: 31-08-2025 నాటికి 15 నుంచి 22 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: పదో తరగతి సాధించిన మార్కులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా సీటు కేటాయిస్తారు.
ముఖ్యమైన తేదీలు:
ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: 28.05.2025
ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చివరి తేదీ: 16.06.2025