ఏపీలో పలు జిల్లాల్లో గాలి వాన బీభత్సం సృష్టించింది. రాష్ట్రంలో భిన్నమైన వాతావరణ పరిస్థితులు మరో రెండు రోజులు కొనసాగుతాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఉరుములు, మెరుపుల నేపథ్యంలో చెట్లకింద ఎవరూ ఉండవద్దని సూచించింది.
విజయవాడ: ఏపీ(AP)లో పలు జిల్లాల్లో గాలి వాన బీభత్సం (Gale and rain) సృష్టించింది. కృష్ణా జిల్లా (Krishna district)లో తీవ్ర ఎండలు, ఉక్కపోతతో జనం అల్లాడిపోతున్న సమయంలొ వాతావరణం (weather)లో ఒక్కసారిగా మార్పు చోటు చేసుకుంది. గన్నవరం రహదారి ప్రాంతంలో నల్లటి మేఘాలు ఒక్కసారిగా కమ్మేసాయి. భారీ ఈదురు గాలులతో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. దీంతో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను అధికారులు నిలిపివేశారు (Electricity disruption). కృష్ణా జిల్లా, కంకిపాడులో ఈదులుగాలులకు పలు హోర్డింగ్లు, చెట్లు కూలిపోవడంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. లోతట్టు ప్రాంతాల్లో రోడ్లపై నీరు చేరింది. పలుచోట్ల విద్యుత్కు అంతరాయం ఏర్పడింది.