( నవ్యాంధ్ర న్యూస్ ) రాయచోటి ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో ప్రొహిబిషన్, ఎక్సైజ్ నేరాలకు సంబందించిన వివిధ కేసుల్లలో పట్టుబడ్డ వాహనాలకు ఈ నెల 15వ తేదీన 5 ద్విచక్ర వాహనాలు, ఒక ఆటోకు గురువారం వేలం పాట నిర్వహిస్తున్నట్లు ఎక్సైజ్ సిఐ హిమబిందు సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వేలంలో పాల్గొనే వారు ముందుగా రూ.5 వేలు దారవత్తు నగదును టోకెన్ చెల్లించాలని తెలిపారు. వేలంలో వాహనాలు దక్కనివారికి ఆ మొత్తం నగదు తిరిగి చెల్లిస్తామని తెలిపారు.
