హిందూ స్మశానాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తాం

Spread the love

అన్నమయ్య జిల్లా ( నవ్యాంధ్ర న్యూస్ ) రాజంపేట మునిసిపల్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన కౌన్సిల్ సమావేశానికి విచ్చేసిన రాజ్యసభ సభ్యులు ఎంపీ మేడా రఘునాథరెడ్డి, శాసనసభ్యులు,వైసిపి జిల్లా అధ్యక్షులు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి,మున్సిపల్ అధ్యక్షులు పోలా శ్రీనివాసుల రెడ్డిలకు కాశీ విశ్వనాథ హిందూ స్మశాన వాటిక అభివృద్ధి కమిటీ అధ్యక్ష,కార్యదర్శి, కార్యవర్గసభ్యులు హిందూ స్మశాన వాటిక అభివృద్ధి కొరకు నిధులు మంజూరు చేయాలని వినతిపత్రం అందజేసి కోరగా స్పందించిన రాజ్యసభ సభ్యులు, ఎంపి, మేడా రఘనాధరెడ్డి రాజ్యసభ నిధుల నుంచి 20లక్షలుహామీ ఇచ్చారు,శాసన సభ్యులు అకేపాటి అమర్నాథ్ రెడ్డి బోరు వేయిస్తానని హామీ ఇచ్చారు, మున్సిపల్ అధ్యక్షులు పోలా శ్రీనివాసుల రెడ్డి మునిసిపల్ నిధుల నుంచి మౌలిక వసతులు కలిపిస్తానని హామీ ఇచ్చారు

మునిసిపల్ కౌన్సిల్ సమావేశంలో గోశాలకు స్థలం కేటాయించాలని తీర్మానం చేశారు
ఈ సందర్బంగా కాశీ విశ్వనాధ హిందూ స్మశానవాటిక అధ్యక్షులు, కార్యదర్శి, కార్యవర్గ సభ్యులు ధన్యవాదములు తెలియజేసారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *