యుగపురుషుడు నందమూరి తారక రామారావు అన్నమయ్య జిల్లా ( నవ్యాంధ్ర న్యూస్ ) రాజంపేట మండలపరిధిలోని వైబియన్ పల్లిలోని నందమూరి తారక రామారావు విగ్రహానికి నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నంద్యాల జిల్లా ఇంచార్జ్ పోతు గుంట రమేష్ నాయుడు పుష్పాంజలి ఘటించి ఘన నివాళులర్పించారు ఈ సందర్భంగా పోతుగుంట రమేష్ నాయుడు మాట్లాడుతూ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటిన నాయకుడు,తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు అన్నారు బడుగు బలహీనవర్గాల సంక్షేమం,రాజకీయ భవిష్యత్తుకు కృషి చేసిన పాలకుడు; ఆంధ్రుల అభిమాన నటుడు; ‘అన్న’గా, నందమూరి తారక రామారావు ప్రజల గుండెలలో కొలువైన మహా నాయకుని జయంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘన స్మృత్యంజలి ఘటించడం మనందరి మహాభాగ్యం ఉన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు ముళ్ళగూరీ సుబ్రహ్మణ్యం నాయుడు భాసినేని రెడ్డయ్య నాయుడు గొల్లపూడి సుబ్రహ్మణ్యం నాయుడు బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి పొట్టు పోగుల ఆదినారాయణ బిజెపి మండల ప్రధాన కార్యదర్శి ముల్లగూరి వేణుగోపాల్ నాయుడు బిజెపి పట్టణ అధ్యక్షులు వివి రమణ పట్టణ కార్యదర్శి ఎన్ గిరీష్ బిజెపి నాయకులు ఆచారి యోగి గణేష్ రామయ్య సుబ్బరాయుడు తదితరులు పాల్గొన్నారు