అన్నమయ్య జిల్లా డిసెంబర్ 06
(నవ్యంధ్ర న్యూస్ )
రాజంపేట మారుతీ ప్రసన్న లాడ్జ్ ఎదురుగా శనివారం భవన నిర్మాణ కార్మికులకు తెలుగుదేశం రాష్ట్ర కార్యదర్శి ఇడిమడకల కుమార్
తండ్రి ఇడిమడకల సుబ్రహ్మణ్యం 36వ వర్ధంతి సందర్భంగా ఇడిమడకల కుమార్
అల్పాహారాన్ని అందజేశారు.
ఈ సందర్బంగా ఇడి మడకల కుమార్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మా తండ్రి వర్ధంతి రోజు అల్పాహారం పంపిణి చేసి మా తండ్రిని స్మరించుకుంటామన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ అద్దేపల్లి ప్రతాప్ రాజు, మాజీ పట్టణ తెలుగుదేశం అధ్యక్షులు తరిగోపుల సంజీవరావు, తెలుగుదేశం నాయకులు చంద్రనాయుడు, మాజీ తెలుగు యువత పట్టణ అధ్యక్షులు రాము యాదవ్, పట్టణ బీసీ నాయకులు మళ్లీ ఆచారి, వజ్ర వాటర్ వాష్ అధినేత తిరుపతి వజ్ర తదితరులు పాల్గొన్నారు.

