తెలుగు భాషా సదస్సుకు ఆహ్వానం అందుకున్న గంగనపల్లి వెంకటరమణ

Spread the love

రాజంపేట, మే 5 ( నవ్యంధ్ర)

తెలుగు భాషకు పట్టాభిషేకం అనే పేరుతో ఈనెల 8వ తేదీ గురువారం హైదరాబాదులోని త్యాగరాయ గానసభ సమావేశ మందిరంలో జరిగే భాషా సదస్సుకు రాజంపేటకు చెందిన తెలుగు అధ్యాపకులు, కవి పండితులు గంగనపల్లి వెంకటరమణ ఆహ్వానం అందుకున్నారు.

హైదరాబాదుకు చెందిన తెలుగు భాషా చైతన్య సమితి 12వ వార్షికోత్సవ వేడుకలలో భాగంగా నిర్వహిస్తున్న ఈ భాష సదస్సులో గంగనపల్లి వెంకటరమణ పాల్గొననున్నారు.

తెలుగు భాషాభివృద్ధి – పరిరక్షణ అనే అంశంపై ఉపన్యసించనున్నారు.

ఈ మేరకు తెలుగు భాషా చైతన్య సమితి వ్యవస్థాపక అధ్యక్షులు పి. బడేసాబ్, సమన్వయకర్త డాక్టర్ వి. జయప్రకాశ్ ల నుండి తనకు ఆహ్వానం అందినట్లు గంగనపల్లి వెంకటరమణ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.

గంగనపల్లి వెంకటరమణ భాష సదస్సుకు ఆహ్వానం అందుకోవడం పట్ల తెలుగు భాషా సంరక్షణ సమితి రాజంపేట మండల శాఖ అధ్యక్షులు బొట్టా రామచంద్రయ్య నాయుడు, ఉపాధ్యక్షులు బి.వి.నారాయణ రాజులు హర్షం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *