డిప్యూటీ సియం ప్రశంసించిన అమర్నాథ్ రెడ్డి పాదయాత్రకు ఆంక్షలా

Spread the love

అన్నమయ్య నడియాడిన కాలిబాటలో అటవీ,పోలీసు శాఖ ఉన్నతాధికారుల ఆంక్షలతో భక్తుల నమ్మకాన్ని ఓమ్ము చేసి మనోభావాలు దెబ్బతిన్నాయన్న అకేపాటి

ముఖ్యమంత్రి చంద్రబాబు కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి భక్తుడే

ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి దర్శన భాగ్యం కల్పించినప్పుడే అన్నమయ్యకాలిబాటలో పాదయాత్ర నిర్వహించి అ ప్రత్యక్ష దైవం
శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటా

అన్నమయ్య జిల్లా డిసెంబర్ 04

(నవ్యంధ్ర న్యూస్ )

రాజంపేట మండల పరిధిలోని ఆకేపాడు గ్రామంలోని అకేపాటి ఎస్టేట్ లో గురువారం వైసీపీజిల్లా అధ్యక్షులు,
స్థానిక శాసనసభ్యులు అకేపాటి అమర్నాథ్ రెడ్డి 23వ తిరుమల మహా పాదయాత్ర పై మీడియా సమావేశంనిర్వహించారు
ఈ సందర్భంగా అకేపాటి మాట్లాడుతూ
అన్నమయ్యనడియాడిన కాలిబాటలో వన్యమృగాలు ఉన్నాయని ఎవ్వురు అన్నమయ్యకాలిబాటలో పాదయాత్ర చేయరాదని ప్రభుత్వం ఆంక్షలు విధించడం చాలా బాధాకరమన్నారు
22 సంవత్సరాల నుంచి వేల మంది భక్తులతో అన్నమయ్యనడియాడిన కాలిబాటలో పాదయాత్రగా వెళ్లి భక్తులు అ కలియుగ ప్రత్యక్ష దైవంశ్రీవెంకటేశ్వర స్వామినిదర్శించుకుంటే కోరిన కోర్కెలు తీరుతాయాని భక్తుల అపార నమ్మకమన్నారు.
అటవీశాఖ,పోలీసు ఉన్నతాధికారులు అన్నమయ్యకాలిబాటలో ఆంక్షలు విధించి భక్తుల నమ్మకాలను ఓమ్ము చేసి భక్తుల మనోభావాలు దెబ్బతీశారన్నారు ప్రభుత్వ ఆంక్షలను గౌరవవిస్తూ 23వ తిరుమల మహా పాదయాత్రలో భాగంగా శుక్రవారం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం నిర్వహించి తిరుమల మహా
పాదయాత్రకు సిద్ధమైన భక్తులతో ఎకశిల నగరం ఒంటిమిట్టకు పాదయాత్రగా వెళ్లి
శ్రీ కోదండరామ స్వామి దర్శించుకుంటామన్నారు అ వెంకటేశ్వర స్వామి దర్శన భాగ్యం
కల్పించినప్పుడు అన్నమయ్యనడియాడిన కాలిబాటలోపాదయాత్రగా వెళ్లి ఆ కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామిని దర్శించు
కుంటానన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *