పుణ్య శ్లోక అహల్య బాయ్ త్రిషతాబ్ది జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నటువంటి త్రి శతాబ్ది జయతోత్సవాలలో భాగంగా 31 మే 2025 3 వ జయంతి సందర్భంగా నిర్వహిస్తూన్న ఆ మహాతల్లి గొప్పతనం అందరికీ చాటి చెబుతూ ఆమె జీవితం మహిళలు ఆదర్శంగా తీసుకోవాలనే ఉద్దేశంతో ఎంతో ఘనంగా దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్న ఉత్సవాల పై అన్నమయ్య జిల్లా రాయచోటి సాయిసుధాకళ్యాణమండపంలో గురువారం జిల్లా అధ్యక్షులు సాయి లోకేష్ అధ్యక్షతన హోల్ సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా సమాచార ప్రసార శాఖ, పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రివర్యులు ఎల్ మురుగన్ విచ్చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పుణ్యస్లోకి రాణి అహల్యాబాయ్ హోల్కర్ చిన్నతనం నుంచి చూపించినటువంటి ధీరోధారతా యుద్ధ నైపుణ్యత కాశీ నుండి కన్యాకుమారి వరకు దేవాలయాల పునర్నిర్మాణం కోసం ఆమె చేసినటువంటి కృషి , దేశం యొక్క ఆర్థిక ఉన్నతి కొరకు పలుచోట్ల గాట్ల నిర్మాణం చేపట్టి ఎగుమతులు దిగుమతులను ప్రోత్సహించారని, అప్పటి కాలంలో ఆమె చేపట్టినటువంటి పలు కార్యక్రమాలకి ప్రస్తుతం మోడీ చేపడుతున్నటువంటి అనేక కార్యక్రమాలలో పలు అంశాలపై విపులంగా వివరించారు. జిల్లా అధ్యక్షులు సాయి లోకేష్ మాట్లాడుతూ రాజ్యంలో సుస్థిర పరిపాలన కోసం అహల్యబాయ్ హోల్కర్ చూపినటువంటి పరిపాలన దక్షత యుద్ధనీతి పలుచోట్ల ఘాట్లు నిర్మాణం ద్వారా వ్యాపార లావాదేవీలు పెంచడం మహిళల స్వావలంబన కోసమై ఆమె చేసిన కృషి చేనేత కార్మికుల కోసం వారు నేసినటువంటి చీరలు ఆమె స్వయంగా ధరించి ప్రచారం చేయడం ద్వారా వాళ్ళ అభ్యున్నతికి ఎంతగానో తోడ్పడ్డారని ప్రస్తుతం మహేశ్వరం చీరలు ఆ కాలంలో ఆమె మహిళల ద్వారా చేయించినటువంటివనడం గర్వకారణమని బాసతీసహగమనం అమలులో ఉన్న సమయంలో అందరిని ఎదురొడ్డి బాల్యవివాహాలను నిర్మూలించేందుకు ఆమె ఎంతగానో కృషి చేశారన్నారు శ్రీశైలంలో గంగా నూతిని ఏర్పాటు చేయడం మరెన్నో పుణ్య కార్యక్రమాలు ఆమె చేశారన్నారు . ఈ కార్యక్రమంలో శాసనమండలి ఉపాధ్యక్షులు శ్రీమతి ఎం జకియా ఖానం, బిజెపి రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు గుడిస దేవానంద్ జిల్లా అధ్యక్షురాలు సునీత నారాయణ వర్మ మహిళా మోర్చా ఉపాధ్యక్షులు బాలజ్యోతి రాయచోటి అసెంబ్లీ కో కన్వీనర్ నిర్మల్ కుమార్ రాయచోటి సీనియర్ నాయకులు రేపన శివప్రసాద్ జిల్లా అధికార ప్రతినిధి డాక్టర్ శ్రీనివాస్ కుమార్ రాజు,బిజెపి స్టేట్ మైనార్టీ మోర్చా ఉపాధ్యక్షుడు బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శసులు పిండిబోయిన కృష్ణ యాదవ్,ఆకుల కృష్ణమూర్తి రాజంపేట అసెంబ్లీ కన్వీనర్ జగదీష్ స్వామి,నాయకులు బండి ఆనంద్ కార్యకర్తలు మహిళలు తదితరులు పాల్గొన్నారు.
