సమస్య రహిత గ్రామాలే కూటమి ధ్యేయం,,,
కొమ్మివారిపల్లి లో బోర్లను ప్రారంభించిన రాజంపేట టిడిపి పార్లమెంటు అధ్యక్షులు చమర్తి జగన్ మోహన్ రాజు
ఆత్మీయ స్వాగతం పలికిన గ్రామస్థులు,,,
ప్రతి గ్రామంలో జలకళతో ప్రజలు సుభిక్షంగా ఉండాలన్నదే ప్రభుత్వ లక్షంలో భాగంగా ఎక్కడా నీటి సమస్య లేకుండా చర్యలు చేపడుతున్నామని రాజంపేట పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు చమర్తి జగన్మోహన్ రాజు అన్నారు
రాజంపేట ( నవ్యాంధ్ర న్యూస్ ) మండల పరిధిలోని కొమ్మివారిపల్లి లో గురువారం తెలుగుదేశం పార్లమెంట్ జిల్లా అధ్యక్షులు చమర్తి జగన్మోహన్ రాజు నీటి కోసం బోర్లకు పూజలు నిర్వహించి ప్రారంభించారు.చమర్తి కి గ్రామస్తులు ఆత్మీయ స్వాగతం పలుకుతూ శాలువాతో ఘనంగా సత్కరించి , గ్రామాలలో సమస్యలను గుర్తించి పరిష్కరిస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా చమర్తి మాట్లాడుతూ నియోజకవర్గంలో ప్రతి మండలంలోనూ ప్రతి గ్రామంలోనూ అన్ని సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తామని, ముఖ్యంగా వేసవిలో నీటి సమస్య లేకుండా ముందుగానే గ్రామాలలో నూతనంగా బోర్లు ఏర్పాటు చేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుందని, ఒక ప్రజా సేవకునిగా ప్రజల సమస్యలను తీర్చడంలో తనకు చాలా ఆనందం కలుగుతుందని, అందుకే సమయంతో పని లేకుండా ఎక్కడ సమస్య ఉంటే అక్కడ పరిష్కార మార్గాన్ని చూపేందుకు నేను సిద్ధంగా ఉన్నామని, గ్రామాలలో ఉన్న సమస్యలను ఎలాంటిదైనా పరిష్కరించేందుకు నేను సిద్ధంగా ఉన్నామని, గ్రామ అభివృద్ధి దేశ అభివృద్ధి అని, మంచి చేయడానికి కూటమి ప్రభుత్వం ఉందని, ప్రభుత్వం తరఫున తాము అందుబాటులో ఉంటామని ఆయన తెలియజేశారు. అందరూ కలిసికట్టుగా పనిచేస్తే గ్రామాలలో సమస్యలు ఉండవని, సమస్యలు లేని గ్రామాలను నెలకొల్పడమే తమ ధ్యేయమని ఆయన తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో రాజంపేట టిడిపి మండల అధ్యక్షులు గన్నేసుబ్బ నరసయ్య నాయుడు, గీతాంజలి విద్యాసంస్థలు గీతాంజలి రమణ, బాపనయ్య నాయుడు, కమ్మ సంఘం అధ్యక్షుడు శివ నారాయణ చౌదరి, ఉపాధ్యక్షుడు సతీష్ రాజు, మాజీ ఎంపీటీసీ గుడారు సుబ్రహ్మణ్యం నాయుడు, కొమ్మి సుబ్రహ్మణ్యం, యువ నాయకులు పరుశురాం నాయుడు, ఉప సర్పంచ్ నాగినేని నరసింహులు నాయుడు, రాంబాబు నాయుడు, బాలాజీ నాయుడు, కళాధర్, శివయ్య నాయుడు, పత్తిపాటి రవి,చంగయ్య, పలువురు టిడిపి ముఖ్య నాయకులు కార్యకర్తలు గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగినది.