రాజంపేట (నవ్యంధ్రన్యూస్) డిపో డ్రైవర్ ఈ.ఆర్.చంద్ర (43) రాయచోటి ఆర్టీసీ బస్టాండ్ లో గుండెపోటుతో మృతి చెందాడు. రాజంపేట నుంచి రాయచోటి చేరుకున్న ఆర్టిసి బస్సును బస్టాండ్ పాయింట్ లో పెట్టి టిఫిన్ తిన్న అనంతరం నీళ్లు పట్టుకోవడానికి రాయచోటిలోని ఆర్టీసీ బస్టాండ్ లోని సెకండ్ ఫ్లోర్ లోకి వెళ్లిన డ్రైవర్ చంద్ర గుండెపోటు రావడంతో అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందినట్లు సమాచారం.
