కత్తర్ లో భారతీయునికి ప్రాణహని ఉందని ఓ ఆంధ్రప్రదేశ్ వాసిఆవేదన

Spread the love

కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపి ఆంధ్రప్రదేశ్ వాసి ప్రాణాలు కాపాడాలని వారి కుటుంబ సభ్యులు కోరుతున్నారు

అన్నమయ్య జిల్లా ( నవ్యాంధ్ర న్యూస్ ) రైల్వే కోడూరు నియోజకవర్గం పుల్లంపేట మండలపరిధిలోని దళాయపల్లి కి చెందిన కరమళ్ళ ఇబ్రహీం జీవన ఉపాధి కోసం 2016 వ సంవత్సరంలో కత్తర్ కు వెళ్లి 2019 వ సంవత్సరంలో ఓ కత్తరీ తో పరిచయమై ఓ ఫ్యాక్టరీ స్థాపించానన్నారు 2024 ఫిబ్రవరి 1వ తేది విబేధాలు రావడంతో నా 5 లక్షల రియాలు,బండి నాకు ఇచ్చేస్తే నేను వేరే కత్తరీని చూసుకుంటానానడంతో నిన్ను పోలీస్ స్టేషన్ లో వేయించి ఇంటికి పోకుండా చేస్తానని బెదిరించాడన్నారు ఫిబ్రవరి 4వ తేదీ న్యాయస్థానంలో కత్తరీ పై కేసు వేసి విజయం సాధించానని కత్తరీ కూడా నా పై మూడు కేసులు వేశాడన్నారు నేను వేసిన కేసు అతను నాపై వేసిన మూడు కేసులలో 16/03/2025 వ సంవత్సరంలో మొత్తం 4 కేసులలో న్యాయస్థనం నాకు అనుకూలంగా తీర్పు ఇచ్చారని న్యాయస్థానం ఇచ్చిన తీర్పు ఆధారాలు,నాకు సంబంధించిన ఆధారాలు తీసుకుని ఇండియన్ ఎంబీసీకి వెళ్లి నా కత్తరీ నాపై ట్రావెల్ బ్యాండ్ చేసాడు అకామా మార్పుకు వేస్తే రద్దు చేస్తున్నాడని నన్ను ఇంటికి పంపడం లేదు వేరే కంపినికి పంపడం లేదని నా పరిస్థితి బాగాలేదని 4 సార్లు ఇండియన్ ఎంబీసీ, హ్యూమన్ రైట్స్ , లేబర్ కోర్టులకు వెళ్లి నాకు న్యాయం చేయమని అధికారులను వేడుకుని ఆధారాలన్నీ ఇచ్చిన అధికారులు పట్టించుకోలేదు, న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేసాడు నన్ను ఇబ్బందులు పెడుతున్న కత్తరీ నాలుగు,ఐదు కేసులు మోపడని 27వ తేదీ మధ్యాహ్నం 2గంటలకు నా మత్తరస్ బ్లాక్ చేయించి అరెస్ట్ వారెంట్ పెట్టించాడని పోలీసులు సిఐడిలు ఎప్పుడైనా నన్ను పట్టుకుని జైల్లో వేయచ్చునని 29 వ తేదీ ఉదయం 9 గంటలకు న్యాయస్థానంలో వాయిదాకు నన్ను వెళ్లానివ్వకుండా అరెస్ట్ చేయించాలని ఇబ్బందులు పెడుతున్నాడనన్నారు గతంలో నాలుగైదు కేసులు పెట్టాడని నాకు నా కత్తరీతో ప్రాణహాని ఉందని భారతదేశ ప్రధాని, హోంశాఖ మంత్రి అమిత్ షా, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ,ఐటీ మంత్రి నారా లోకేష్, హోంశాఖ మంత్రి అనితలు నా ప్రాణాలను కాపాడి భారతదేశానికి వచ్చేలా చొరవ చూపాలని బాధితుడు, కుటుంబ సభ్యులు కోరుతున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *