ఉల్లంఘించిన వారిపై జంతు హింస నివారణ చట్టం ప్రకారం క్రిమినల్ చర్యలు తీసుకోబడునని హెచ్చరించిన జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి
అన్నమయ్య జిల్లా జూన్ 04
( నవ్యాంధ్ర న్యూస్ )
ఆవులు దూడలు ఒంటెల వధ నిషేధం చట్టరీత్యా నేరమని, ఉల్లంఘించిన వారిపై జంతుహింస నివారణ చట్టం ప్రకారం క్రిమినల్ చర్యలు తీసుకోబడతాయని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి అన్నారు
రాయచోటి కలెక్టరేట్ లోని కలెక్టర్ చాంబర్ లో జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి పశుసంవర్ధక శాఖ అధికారులతో కలసి “ఆవులు,దూడలు,ఒంటెల వధ నిషేధం చట్టరీత్యా నేరం” అనే అంశం పై రూపొందించిన గోడ పత్రాలను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆవులు దూడలు ఒంటెల వధ నిషేధం అని,
ఈ ఆదేశాలను ఉల్లంఘించిన వారిపై జంతు హింస నివారణ చట్టం 1960 ఆంధ్రప్రదేశ్ గోవధ నిషేధము,పశు సంరక్షణ చట్టం 1977ల ప్రకారం క్రిమినల్ చర్యలు తీసుకోబడతాయన్నారు
ఈ కార్యక్రమంలో జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి గుణశేఖర్ పిళ్ళై,తదితరులు పాల్గొన్నారు.