ఆటో డ్రైవర్స్ యూనియన్ నాయకుడి మృతికి సంతాపం కడప జిల్లా మార్చి 15 (నవ్యంధ్ర న్యూస్) రాజంపేట బైపాస్ రోడ్డులోని ఎఐటియుసి కార్యాలయ అవరణంలో ఆదివారం ఆటో డ్రైవర్స్ యూనియన్ నాయకుడు కామ్రేడ్ ఈ.నాగేశ్వరరావు మృతికి సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి పి. మహేష్, ఏఐటీయూసీ జిల్లా సహాయ కార్యదర్శి ఈ. సికిందర్, ఏఐటీయూసీ నాయకులు, మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు సరోజనమ్మ, సిపిఐ–ఏఐటీయూసీ నాయకులు రమణ, సురేష్, సాయి పాల్గొన్నారు.నాయకులు మాట్లాడుతూ, కామ్రేడ్ ఈ. నాగేశ్వరరావు ఆటో కార్మికుల హక్కుల కోసం నిరంతరం పోరాడిన నాయకుడని పేర్కొన్నారు. ఆయన మృతి కార్మిక ఉద్యమానికి తీరని లోటని అన్నారు. అనంతరం నాయకులు, కార్యకర్తలు కలిసి ఆయనకు నివాళులర్పించి ప్రగాఢ సంతాపం తెలిపారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *