అన్నమయ్య జిల్లా జూన్ 20
( నవ్యాంధ్ర న్యూస్ )
రాజంపేట కడప – తిరుపతి ప్రధాన రహదారిలో వెలసియున్న ప్రసిద్ధి గాంచిన ఆంజనేయ స్వామి ఆలయంలోని హుండీలో ఓ అజ్ఞాత భక్తుడు విలువైన వజ్రంతోపాటు టెస్టింగ్ కార్డు,ఓలేఖను వేసినట్లు ఈవో తెలిపారు.
ఈ సందర్బంగా ఆలయ ఈఓ,అర్చకులు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ గురువారం హుండీ ఆదాయాన్ని లెక్కిస్తున్న సమయంలో వజ్రం వేసినట్లు గుర్తించామన్నారు
భక్తుడు ఆ లేఖలో డైమండ్ తనకు దొరికిందని దీనిని అమ్మ లేక, భరించలేక వస్తువుగా తయారు చేసి ఇచ్చే శక్తి లేక హుండీలో వేశానని ఈ వజ్రాన్ని ఏదో విధంగా
ఆలయానికి ఉపయోగపడేలాగా వినియోగించాలని ఆశిస్తున్నట్టు లేఖలో పేర్కొన్నాడన్నారు
ఆలయ హుండీ లెక్కింపులో మునుపెన్నడు విలువైన కానుకలు హుండీలో వేసిన ఘటనలు లేవని ఆలయ పూజారి రవి స్వామి తెలిపారు.