అన్నమయ్య జిల్లా రాజంపేట ( నవ్యాంధ్ర న్యూస్ )
పట్టణంలోని ఆటవీశాఖ కార్యాలయంలో సోమవారం అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న సోషల్ మీడియా నిర్వాహకుల పై అటవీ శాఖ జిల్లా అధికారి జగన్నాథ్ సింగ్ మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా అధికారి జగన్నాథ్ సింగ్ మాట్లాడుతూ అటవీ ప్రాంతంలో అక్రమంగా ఏర్పాటు చేసిన ట్రెక్కింగ్ నిర్వాహకుల పై కేసు నమోదు చేశామన్నారు.ఇంస్టాగ్రామ్, వాట్సాప్, యూట్యూబ్ ఛానల్స్ లతో అటవీశాఖ అందాలను చూపుతామని యువతకు ఎరవేసి ఒక్కో జంట వద్ద 30 వేల నుంచి 40 వేల వరకూ అక్రమ.వసూళ్లకు పాల్పడుతున్న సోషల్ మీడియా నిర్వాహకులు సోమశేఖర్, ప్రదీప్, నిఖిత్ ల పై కేసు నమోదు చేశామని.తలకోన వాటర్ ఫాల్స్ వద్ద పదిమంది అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలతో పాటు మద్యం బాటిల్ లను స్వాధీనం చేసుకున్నమన్నారు అక్రమంగా అడవిలోకి ప్రవేశించి మందు పార్టీలు నిర్వహిస్తే కేసులు తప్పవని హెచ్చరించారు