జాతీయ భద్రత కొరకు ప్రజల భాగస్వామ్యం
పుల్లంపేట ( నవ్యాంధ్ర న్యూస్ )
స్థానిక ఎస్ బివిడి పాఠశాల నుండి శివాలయం వీధి గుండా పుల్లంపేటలోని అన్ని వీధులలో జాతీయ జెండాలతో భారత్ మాతాకీ జై వందేమాతరం అంటు నినాదాలు చేస్తూ భారత సాయుధ బలగాలకు మేము అండగా ఉంటామని తిరంగ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నంద్యాల జిల్లా ఇంచార్జ్ పోతుగుంట రమేష్ నాయుడు పాల్గొన్నారు ఈ సందర్బంగా పోతుగుంట రమేష్ నాయుడు మాట్లాడుతూ పహల్గం దాడి అనంతరం ఆపరేషన్ సింధూరి పేరు మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో త్రివిధ దళాలు మన శత్రుదేశం పాకిస్తాన్ లోని శత్రు స్థావరాల పై ప్రపంచం నివ్వేర పోయే విధంగా దాడి చేయడం తీవ్రవాదుల స్థావరాలను మట్టు పెట్టరన్నారు ఈ పోరాటంలో మన సైనికులు కొంతమంది పరమపదించారు ఆపరేషన్ సింధూర్ కొనసాగుతున్న వేల భారత సాయుధ బలగాలకు మేము అండగా ఉంటామని జాతీయ భద్రత కొరకు ప్రజల భాగస్వామ్యంతో ప్రతి మండల కేంధ్రాలలో అన్ని వర్గాల ప్రజలతో కలిసి ఈ తిరంగా ర్యాలీలు నిర్వహిస్తున్నామన్నారు
ఈ కార్యక్రమంలో పుల్లంపేట బిజెపి మండల అధ్యక్షులు మనోహర్ రెడ్డి బిజెపి అసెంబ్లీ కన్వీనర్ గడ్డం చంగల్ రాజు ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి పట్టుపోగల ఆదినారాయణ బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కంబాల శ్రీనివాసులు బిజెపి మండల ప్రధాన కార్యదర్శులు ఎన్ పరమేష్ కిరణ్ కుమార్ రాజారెడ్డి శంకర్రాజు పుల్లారెడ్డి సుబ్బయ్య పుల్లంపేట పుర ప్రముఖులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు