అద్దేపల్లి రాంప్రసాద్ రాజుతో స్నేహం మరవలేనిది
అన్నమయ్య జిల్లా ( నవ్యాంధ్ర న్యూస్ ) రాజంపేట మండలపరిధిలోని బోయనపల్లి 108 అన్నమయ్య విగ్రహ సమీపంలో ఆదివారం మదన గోపాలపురం నివాసి అద్దేపల్లి రాంప్రసాద్ రాజును స్మరించుకుంటూ స్నేహితులు చంద్రమౌళి, వరదరాజు,సుధీర్ రాజు, శ్రీనాథ్ రాజు, సుధీర్ కుమార్, న్యాయవాది ప్రతాప్ రాజు, జయచంద్ర రాజు,నరసింహ, దామోదర్, లక్ష్మికర్ రాజు,షేక్ చాన్ బాషా, షేక్ మాబు, గౌస్ పీర్, తదితరులు సంతాప సభ నిర్వహించి అన్నదానం నిర్వహించారు ఈ సందర్బంగా చంద్రమౌళి,వరదరాజు,సుధీర్ రాజు మాట్లాడుతూ మాస్నేహితుడు అద్దేపల్లి రాంప్రసాద్ రాజు ఇటీవల హఠాత్తుగా మృతి చెందడం చాలా బాధాకరమని ప్రతి ఒక్కరికి మరణం సహజం కానీ మా స్నేహితుణి అకాల మరణం మమ్ములను ఎంతగానో బాధిస్తోందన్నారు మా స్నేహితుణితో గడిపిన మధుర స్మృతులను ఎన్నటికీ మరవలేమన్నారు హఠాత్తుగా మా నుండి దూరమై దివికేగిన మా ప్రాణ స్నేహితుడు అద్దేపల్లి రాంప్రసాద్ రాజు ఆత్మకు శాంతి కలగాలని అ భగవంతుని ప్రార్థిస్తూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ అశ్రునయనాలతో శ్రద్ధాంజలి ఘటిస్తూ ఘన నివాళులర్పిస్తూ ఈ సంతాప నిర్వహించామన్నారు ఈ సంతాప సందర్భంగా పలువురికి అన్నదానం నిర్వహించామన్నారు
ఈ కార్యక్రమంలో అద్దేపల్లి రాంప్రసాద్ రాజు, తమ్ముడు క్రిష్ణ ప్రసాద్ రాజు,అద్దేపల్లి రాంప్రసాద్ కుమారుడు బన్ని,మదన గోపాలపురం వాసులు కొండూరు విశ్వనాథరాజు,సందీప్ తదితరులు పాల్గొన్నారు