వేడుకగా ప్రపంచ పర్యావరణ దినోత్సవం,వనమహోత్సవ జిల్లాస్థాయి వేడుకలు

Spread the love

అన్నమయ్య జిల్లా

( నవ్యాంధ్ర న్యూస్ )

రాజంపేట – రాయచోటి రహదారలోని నగరవనంలో
అటవీశాఖ ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవ,
వనమహోత్సవ జిల్లాస్థాయి వేడుకలను వేడుకగా నిర్వహించారు
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి, ప్రభుత్వ విప్, రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్, రాజంపేట శాసన సభ్యులు ఆకేపాటి అమర్నాథరెడ్డి,జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్, సబ్ కలెక్టర్లు నైదియాదేవి, మేఘస్వరూప్, డీఎఫ్ఓ ఆర్. జగన్నాథ్ సింగ్, రాజంపేట ఏఎస్పి మనోజ్ రామనాథ్ హెడ్జ్,
సబ్ డిఎఫ్ఓలు జి సుబ్బురాజు, ఎస్.శ్రీనివాసులు, మున్సిపల్ అధ్యక్షులు పోలా శ్రీనివాసులురెడ్డి, అన్నమయ్య జిల్లా బిజెపి అధ్యక్షులు సాయిలోకేష్,
ఇతర ప్రజా ప్రతినిధులు,
జిల్లా అధికారులు తదితరులు పాల్గొని వారి వారి పేర్లతో మొక్కలు నాటారు
ఈ సందర్భంగా నగరంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అహుతులను అలరించాయి
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి మాట్లాడుతూ
ప్రపంచ పర్యావరణ మరియు వన మహోత్సవ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాజంపేట నగరవణంలో అత్యంత వేడుకగా జిల్లా స్థాయి కార్యక్రమాలు నిర్వహించారు
ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా 4.36 లక్షల మొక్కలు నాటి
వచ్చే వన మహోత్సవం నాటికి 21 లక్షల మొక్కలకు పెంచే విధంగా ప్రణాళికలు రూపొందించుకొని ముందుకు వెళ్తమన్నారు
రాష్ట్రంలోని మొత్తం భూభాగంలో 50% పచ్చదనంతో నింపాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దేశమని ఆశయాలకు అనుగుణంగా జిల్లాలో పచ్చదనం పెంపు కోసం కృషి చేస్తున్నామన్నారు
ప్రపంచవ్యాప్తంగా ప్లాస్టిక్ కాలుష్య రహితాన్ని నివారించడం
ప్రధాన ధ్యేయంగా చేస్తున్న కృషిలో భాగంగా జిల్లాలో పర్యావరణ, వాయు కాలుష్యం నివారణకు విరివిగా మొక్కలు నాటడం జరుగుతోందన్నారు
మనకు రుతుపవనాలు ముందుగానే వచ్చాయని వర్షాలు పడ్డాయి కాబట్టి మొక్కలు బాగా పెరిగేందుకు అవకాశం ఏర్పడిందన్నారు మొక్కలు నాటడమే కాదు వాటిని సంరక్షించడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని జిల్లాలో ప్రతి ఒక్కరు ఒక మొక్కను నాటి వాటిని రక్షించి పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలన్నారు
ఈ కార్యక్రమంలో రాజంపేట నగర ప్రముఖులు, విద్యార్థిని విద్యార్థులు, వివిధ శాఖల అధికారులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *