యోగాతో సంపూర్ణ ఆరోగ్యం పొందవచ్చు

Spread the love

జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి

ప్రతినిత్యం యోగ సాధన వల్ల సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుందని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి అన్నారు అన్నమయ్య జిల్లా ( నవ్యాంధ్ర న్యూస్ ) నందలూరు

యోగాంధ్ర 2025 జిల్లాస్థాయి కార్యక్రమంలో భాగంగా… ప్రముఖ పర్యాటక కేంద్రం, ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ సౌమ్యనాథ ఆలయం అవరణంలో జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి ఆధ్వర్యంలో..అత్యంత ఆహ్లాదకర వాతావరణంలో యోగ కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… జూన్ 21న అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా మన రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా నేడు నందలూరు సౌమ్యనాథ ఆలయంలోని విశాల ప్రాంగణంలో వెయ్యి మందితో కలిసి యోగా ఆసనాలు వేయడం జరిగింది. యోగాను నిత్య జీవితంలో భాగం చేసుకుంటే.. శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా ఎంతో పరిణితి చెందేలా ఉన్నతమైన జీవితం వైపు అడుగులు వేసే విధంగా మనకు ఎంతో ఉపకరిస్తుంది. నేడు ఇక్కడ వేసిన ఆసనాలను మరొక నెల రోజులపాటు అభ్యాసం చేస్తూ దానిని నిత్యజీవితంలో భాగంగా మలచుకోవాలి. తద్వారా సంపూర్ణ ఆరోగ్యం చేకూరి ఆరోగ్య ఆంధ్ర సాధ్యమవుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. నేటి కార్యక్రమం విజయవంతంలో భాగస్వాములైన వారందరికీ కూడా కలెక్టర్ అభినందనలు తెలిపారు.

ఇందులో భాగంగా మొదట ఉదయం ఆరున్నర గంటలకు ప్రారంభమైన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. రాజంపేట హైదర్ నగర్ కు చెందిన న్యాయ శాస్త్రం రెండో సంవత్సరం చదువుతున్న ఆర్ ఏ ఈ మహిధ్య(20) వేసిన యోగాసనాలు అందరిని అబ్బురపరిచాయి.

ఈ కార్యక్రమంలో కలెక్టర్ తో పాటు జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్, డీఎఫ్ఓ జగన్నాథ్ సింగ్, సబ్ డిఎఫ్ఓ సుబ్బరాజు, జిల్లా పర్యాటక అధికారి నాగభూషణం, డిఆర్డిఓ, డ్వామా పీడీలు వెంకటరత్నం, జిల్లా ఎక్సైజ్ అధికారి మధుసూదన్, పిఆర్, ఆర్అండ్బి, విద్యుత్ శాఖ ఎస్ఈలు దయాకర్ రెడ్డి, సహదేవరెడ్డి, శ్రీనివాస రెడ్డి, డిఎంహెచ్ఓ ఉషశ్రీ, డీఎస్డిఓ గౌస్ భాషా, పశుసంవర్ధక శాఖ అధికారి మరియు మండల స్పెషల్ అధికారి గుణశేఖర్ పిళ్ళై, తహసిల్దార్ పుల్లారెడ్డి, ఈవోపీఆర్డి సునీల్ కుమార్, ఎంపీడీవో, మండల అధికారులు, పట్టణ ప్రముఖులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *