మహానాడు లో రాజంపేట సత్తా చాటుదాం
కార్యకర్తలకు నిరంతరం అండగా ఉంటాం
కదం తొక్కిన తెలుగు తమ్ముళ్లు
టిడిపి నీ బలహీనపరిచే ప్రయత్నాలు చేస్తే సహించేది లేదు
కార్యకర్తల జోలికి వస్తె వైసీపీ నాయకుల ఏం గతి పడుతుందో నిరూపించాం
కలిసి కట్టుగా పనిచేద్దాం
తెలుగు తమ్ముళ్ళ కోసం ఎప్పుడూ అందుబాటులో ఉండడం
నా బాధ్యత
మే 27 28 29 న కడపలో నిర్వహించే తెలుగుదేశం పండుగ మహానాడు లో నియోజకవర్గ టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొని తమ సత్తా చాటి, అధిష్టానానికి నియోజకవర్గ టీడీపీ బలాన్ని నిరూపిద్దామని పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు చమర్తి జగన్మోహన్ రాజు శ్రేణులకు పిలుపునిచ్చారు.
రాజంపేట ( నవ్యాంధ్ర న్యూస్ )
పట్టణంలోని ఏబి చంద్రారెడ్డి కన్వెన్షన్ హాల్ లో గురువారం నిర్వహించిన మిని మహానాడు విజయవంతమైనది. అబ్జర్వర్ బల్లి దుర్గప్రసాద్ ముఖ్యఅతిథిగా పాల్గొన్న మినీ మహానాడులో నియోజకవర్గ ఆరు మండలాల నాయకులు,కార్యకర్తలు,
తెలుగు తమ్ముళ్లు పాల్గొని
టీడీపీ పార్లమెంట్ కార్యాలయం నుండి మినీ మహానాడు నిర్వహించే సభాప్రాంగణం వరకు చమర్తి జగన్మోహన్ రాజుకు అడుగడుగునా బ్రాహ్మరథం పట్టారు
ఈ సందర్బంగా అబ్జర్వర్ బల్లి దుర్గాప్రసాద్ మాట్లాడుతూ నియోజకవర్గ తెలుగుదేశం నాయకులకు కార్యకర్తలకు చమర్తి జగన్మోహన్ రాజు అండగా ఉంటు తోడునీడగా ఉంటారన్నారు మిని మహానాడును విజయవంతం చేసిన నాయకులు,కార్యకర్తలు, అభిమానులకు ధన్యవాదాలు తెలియజేశారు జగన్ రాజు నాయకత్వంలో కడపలో నిర్వహించే మహానాడులో రాజంపేట నుండి పెద్ద ఎత్తున నాయకులు,కార్యకర్తలు, అభిమానులు పాల్గొని సత్తా చాటి
మహానాడును విజయవంతం చేయడం మన కర్తవ్యమన్నారు
చమర్తి మాట్లాడుతూ తనకు వ్యక్తిగత ఎజెండాలు ఏమీ లేవని, తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు, బలోపేతం,కార్యకర్తలకు అండగా ఉంటు,అధిష్టానం ఆదేశాలు పాటిస్తూ నిరంతరం అందుబాటులో ఉండడమే తన లక్ష్యమన్నారు.మహానేత స్వర్గీయ నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీలో కొనసాగడం, మార్గదర్శకుడు నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పనిచేయడం, భవిష్యత్ నాయకుడు నారా లోకేష్ సహకారంతో బాధ్యతలు నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. గతంలో తెలుగుదేశం పార్టీని విచ్ఛిన్నం చేయడానికి కొందరి నాయకుల ప్రయత్నాలు ఫలించలేదని అందరం కలిసికట్టుగా పనిచేసి మినీ మహానాడుని విజయవంతం చేసినట్లే మహానాడులో నియోజకవర్గం నుండి 30 వేల మందితో కడుపలో అడుగుపెట్టి చంద్రబాబు మనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుందామని పిలుపునిచ్చారు. సీనియర్ నాయకుల సూచనలతో నాయకులు కార్యకర్తలు అండదండలతో అందరి సహకారంతో రాజంపేటను అభివృద్ధి దిశగా నడిపించి తెలుగుదేశం పార్టీని తిరుగులేని శక్తిగా చేసుకుని కష్టపడ్డ ప్రతి కార్యకర్త టిడిపిలో గౌరవంగా ఉండేలన్నారు వైసిపి వారికి వైసీపీ పార్టీ కంటే టిడిపి పార్టీ అంటేనే చాలా ప్రేమ అని, అందుకే ఎప్పుడు టిడిపి నామస్మరణ చేస్తూ టిడిపిని బ్రష్టు పట్టించేందుకు కొందరి ద్వారా రాజకీయ వ్యభిచారం చేస్తున్నారన్నారు, తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం పుట్టిన పార్టీలో కొనసాగుతున్న ఏ నాయకుడు రాజకీయ వ్యభిచారాలకు లొంగరని, రాజంపేట నియోజకవర్గంలోని ప్రతి నాయకునికి కార్యకర్తకు శిరస్సు వంచి నమస్కరిస్తూ కలిసి పని చేద్దామన్నారు రాజంపేటలో పసుపు జెండా ఎగరేద్దామని చంద్రబాబు నాయుడు,లోకేష్ నమ్మకాన్ని నిలబెట్టుదమన్నారు
ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని ఆరు మండలాల అధ్యక్షులు, రాష్ట్ర కార్యదర్శులు, క్లస్టర్ ఇన్చార్జులు మున్సిపల్ కౌన్సిలర్లు, యూనిట్ ఇన్చార్జులు, తెలుగుదేశం ముఖ్య నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు