మా స్థలం మాకు దక్కకుంటే మాకు చావులే శరణ్యం
అన్నమయ్య జిల్లా ( నవ్యాంధ్ర న్యూస్ ) రాజంపేట మండలపరిధిలోని బోయనపల్లిలో నివాసం ఉంటున్న ఓ కుటుంబసభ్యుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి రామకృష్ణయ్య తండ్రి వెంకట స్వామికి సర్వే నెంబరు 1119 లో 288 ప్లాట్ నెంబర్ ను పాత మాధవరం గ్రామం సోమశిల ముంపు ప్రాంతానికీ గురైనందున మండలపరిధిలోని బోయనపల్లి గ్రామంలో 5 సెంట్లు స్థలం 500 రూపాయలు విక్రయముతో 1987 వ సంవత్సరంలో మంజూరు రెవిన్యూ అధికారులు మంజూరు చేసినారు అందులో మా నాన్న కొన్నాళ్లు నివాసం ఉండి మరణించిన తరువాత నేను జీవనోపాధి కొరకు గల్ఫ్ వెళ్లానని
అ సమయములో M శేషయ్య మా నాన్న స్థలములో నివాసం ఎర్పాటు చేసుకుని ఉండగా నేను ఇండియాకు వచ్చి శేషయ్యను అడుగగా కొద్ది రోజులు ఉండి వెళ్తామని చెప్పి నకిలీ పత్రాలు చేసుకుని మా స్థలాన్ని ఆక్రమించుకున్నాడు మా స్థలము ఇవ్వమని అడగగా పోలీసులతో మమ్మలను ఇబ్బందులు పెడుతుండడంతో గత సంవత్సరం నుంచి నేను అర్జీలు ఇస్తూ రెవిన్యూ కార్యాలయం చుట్టూ తిరుగుతు రెవిన్యూ సదస్సులో అర్జీ ఇవ్వగా తహసీల్దార్ విచారణలో M. సుబ్బారాయుడిని మీకు స్థలం
ఏ విధముగా వచ్చినదని ప్రశ్నించగా వారు మా వద్ద 2000 రూపాయలకు కొన్నామని చెప్పడంతో తహశీల్దార్ పత్రాలు చూపించమన్నారు అవి లేవని కలెక్టర్ తీసుకెళ్లారని చేప్పిన్నారు మా వద్ద కలెక్టర్ ఇచ్చిన ప్రొసీడింగ్స్ డి ఫార్మ్ డీ ఫార్మ్ అసైన్మెంట్ లిస్ట్ అటెస్టెడ్ కాపీ ఉన్న సంబంధిత అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు 10 నుండి 15 అర్జీలు ఇచ్చిన విచారణ చేయకుండా ఒకటే రిపోర్ట్ ఇస్తున్నారని. అ స్థలం లోనికి మమ్మల్ని పోనికుండా పోలీస్ వారిని మా ఇంటికి పంపించి కేసులు నమోదు చేస్తామని మమ్మల్ని భయభ్రాంతులకు
గురిచేస్తున్నారన్నారు
గత సంవత్సరం నుంచి సంబంధిత అధికారులకు
మా సమస్యను విన్నవించిన పట్టించుకోకుండా అక్రమదారులు ఇల్లు నిర్మించుకుని ఇంట్లో చేరిన పట్టించుకోలేదని వాపోయారు
ఎం శేషయ్యకు716,717,732,733 పట్టాలు ఏ విధంగా మంజూరు చేసి రెవిన్యూ రికార్డులో ఎంక్రోచ్మెంట్ గా ఎలా నమోదు చేసారో నారా లోకేష్, గొట్టిపాటి రవికుమార్, తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ లను కలసి మా సమస్యను వివరించి వినతిపత్రం సమర్పించగా వారు వెంటనే స్పందించి సంబంధిత అధికారితో చరవాణి ధ్వారా బాధితులకు న్యాయం చేయాలని ఆదేశాలు ఇచ్చిన షాకాజు నోటీస్ ఇవ్వలేదన్నారు ఇప్పటికైనా ఉన్నతాదికారులు, ప్రజాప్రతినిధులు మాకు న్యాయం చేయాలని కోరుతున్నారు