అన్నమయ్య జిల్లా డిసెంబర్ 25
(నవ్యంధ్ర వార్త పత్రిక)
కలకడకు చెందిన రాజా పవన్ కుమార్ 7 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించినప్పటికీ, వాటికి సంతృప్తి చెందకుండా ఎస్ఐగా సెలెక్ట్ అయ్యాడు. 2022లో బిటెక్ పూర్తి చేసిన పవన్ కుమార్, ఇన్కం ట్యాక్స్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ హవల్దారుగా, 2023లో రెవెన్యూ డిపార్ట్మెంట్లో జూనియర్ అసిస్టెంట్గా కొంతకాలం పనిచేశారు. తరువాత ఎస్ఐ నోటిఫికేషన్ రావడంతో కఠినమైన శిక్షణ పూర్తి చేసి, తిరుపతి జిల్లా భాకరాపేటలో ఎస్ ఐ గా నియమితులు అయ్యారు.

