ఎన్టీఆర్ విగ్రహానికి తెలుగు తమ్ముళ్లతో కలిసి పూలమాల వేసిన చమర్తి.
కారణజన్ముడు స్థాపించిన పార్టీ లో పని చెయ్యడం అదృష్టం,,,
తెలుగు వారి ఆత్మ గౌరవానికి ప్రతీక స్వర్గీయ నందమూరి తారక రామారావు
కారణజన్ముడు నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ లో సభ్యునిగా పనిచేయడం తన అదృష్టమని రాజంపేట టిడిపి పార్లమెంట్ అధ్యక్షులు చమర్తి జగన్మోహన్ రాజు అన్నారు అన్నమయ్య జిల్లా ( నవ్యాంధ్ర న్యూస్ ) నందమూరి తారకరామారావు జయంతి సందర్భంగా బుధవారం బైపాస్ లోని నందమూరి తారక రామరావు విగ్రహానికి తెలుగుదేశం పార్లమెంట్ జిల్లా అధ్యక్షులు చమర్తి జగన్ మోహన్ రాజు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా చమర్తి మాట్లాడుతూ జోహార్ ఎన్టీఆర్ అనే నినాదం తెలుగుజాతి ఉన్నన్నాళ్ళు వినిపిస్తుందని, తెలుగువారి ఆత్మగౌరవం ప్రపంచవ్యాప్తంగా నిలిపేందుకు ఆయన స్థాపించిన తెలుగుదేశం పార్టీ నేడు ఎంతో మంది సామాన్య కార్యకర్తలను నాయకులుగా చేసిందని, అన్నగారి ఆశీస్సులతో చంద్రబాబు గారి సారధ్యంలో లోకేష్ గారి ప్రోత్సాహంతో తామందరం తెలుగుదేశం పార్టీ బలోపేతానికి, ఆంధ్రుల గౌరవానికి , రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తామని ఆయన తెలియజేశారు. ఒక వ్యక్తి తలుచుకుంటే ఎంత ప్రభావితం చేయగలరో మహానేత ఎన్టీఆర్ గారిని చూసి తెలుసుకోవచ్చని, అటు సినిమా రంగంలో ఇటు రాజకీయ రంగంలో ఎన్టీఆర్ ని మించిన మహోన్నత వ్యక్తి మరొకరు లేరని, భారతరత్నతో ఆయనకు భారత ప్రభుత్వం గౌరవం అందించాలని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు టిడిపి ముఖ్య నాయకులు పసుపు సైనికులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.