హస్తవరం,చెర్లోపల్లి పంచాయతీ పరిధిలోని
చెంచురాజుగారి పల్లి , అలుగు హరిజనవాడ, చెర్లోపల్లి హరిజనవాడ,
వడ్డీ పాలెం, యానాది పాలెం,గొల్లపల్లె, కొండ రాజుగారిపల్లె,పెద్దపల్లె గ్రామాలలో పర్యటించిన రాజంపేట జనసేన పార్లమెంట్ ఇన్చార్జ్ యల్లటూరు శ్రీనివాసరాజు
కడప జిల్లా ఏప్రిల్ 11
(నవ్యంధ్ర న్యూస్ )
రాజంపేట మండలపరిధిలోని హస్తవరం,చెర్లోపల్లి గ్రామాలలో పర్యటించిన సందర్భంగా, గ్రామ ప్రజలు, పెద్దలు, యువకులు, మహిళలు ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా సీనియర్ రాజకీయ నాయకులు కొండూరు విజయ నరసింహా రాజుకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
యల్లటూరు శ్రీనివాసరాజు సమక్షంలో యల్లటూరు నాయకత్వాన్ని బలపరుస్తూ పంచాయతీ పరిధిలోని 100 కుటుంబాలు జనసేన పార్టీలో చేరారు.
గ్రామ పెద్దలను యల్లటూరు శ్రీనివాస రాజు సన్మానించి గ్రామ ప్రజలందరితో కలిసి గ్రామంలో పర్యటించి ప్రతి ఇంటికి వెళ్లి వారిని పలకరించి వారి సమస్యలను,గ్రామ సమస్యలను అడిగి తెలుసుకునీ సమస్యలను ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకుని వెళ్ళి పరిష్కారిస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో వైస్ సర్పంచ్ నరసింహ రాజు, కే.జయకృష్ణమరాజు ,
కే రవి,డి.సుబ్బరామరాజు, కీర్తిపాటి రాజేంద్ర రాజు, ఎస్. ఆదినారాయణ రాజు (వార్డు మెంబర్), మురళి ,డి.రఘురామరాజు, కే. ఈశ్వర్ రాజు, కె . ఎల్ .కుమార్ రాజు , చెంగల రాజు, ఎస్ రామరాజు, కే శ్రీనివాసరాజు, బి. వెంకటసుబ్బయ్య, బీ.సీ. రాజు, మాజీ సర్పంచ్ శ్యామల, ఏ సుబ్బయ్య ఎక్స్ ఆర్మీ, బి సుబ్బయ్య, చిట్టి బోయిన సుబ్బయ్య, గురవయ్య (రాజంపేట యానాది సంఘం అధ్యక్షుడు), గంగయ్య సుబ్బరామయ్య, విష్ణువర్ధన్ , ఉమ్మడి నరసింహ , శివయ్య , ఈశ్వరయ్య, ముత్యం సంగయ్య, బాలిపోగు బుజ్జి , పరుశురాం, నాగరాజా రెడ్డయ్య , నరసింహ , గంగమ్మ, నరసయ్య , హెచ్ పెంచలయ్య, గంట ఎల్లమ్మ తదితరులు పాల్గొన్నారు

