రూ. 20 లక్షల వ్యయంతో నూతన సిమెంట్ రోడ్డు పనులకు పూజ చేసిన
జనసేన పార్లమెంట్ ఇంచార్జ్ యల్లటూరు శ్రీనివాస రాజు
కడప జిల్లా మార్చి 07
(నవ్యంధ్ర న్యూస్ )
రాజంపేట మండలపరిధిలోని తాళ్లపాక పంచాయతీలో శనివారం నూతన సిమెంట్ రోడ్డు పనులను గ్రామ ప్రజల సమక్షంలో జనసేన నేత యల్లటూరు శ్రీనివాస రాజు పూజ నిర్వహించారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో రాష్ట్రంలో గ్రామాలు, పట్టణాల రోడ్లు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలతో అభివృద్ధి,సంక్షేమం పరుగులు పెడుతున్నాయన్నారు.
ఈ సందర్భంగా
ఆ ప్రాంతంలోని రైతులు, ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో స్థానికులు ఉప సర్పంచ్ బాలరాజు సుమన్ రాజు, బాలరాజు శేఖర్ రాజు, ఎర్రగుడి రాజశేఖర్ రాజు, సుబ్బరాజు, జవ్వాజి హరి, జవ్వాజి వంశీ, చంటి, హరి, శ్యామల బోయిన సూరి, ఆళ్లగడ్డ రామ్మోహన్ రాజు, కృష్ణంరాజు, నీలి శేఖర్, రుద్రరాజు నాగేశ్వర రాజు, భూపతి మల్లికార్జున, అనిల్, గూడూరు శ్రీనివాసరాజు, రేనాటి రాకేష్, తిరుమల తదితరుల పాల్గొన్నారు.

