అన్నమయ్య జిల్లా ( నవ్యాంధ్ర న్యూస్ ) రాజంపేట బైపాస్ రోడ్డు లోని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కార్యాలయంలో సోమవారం రాష్ట్ర అధికార ప్రతినిధి మేడా విజయ శేఖర్ రెడ్డి మహానాడులో నియోజకవర్గంలోని టిడిపి శ్రేణులు అత్యధికంగా పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిస్తూ మీడియా సమావేశం నిర్వహించారు కాబోయే ముఖ్య మంత్రి నారాలోకేష్ ఆధ్వర్యంలో నిర్వహించే మహానాడులో టిడిపి శ్రేణులు ప్రతి ఒక్కరూ పాల్గొని దేశ చరిత్రలో నిలిచిపోయేలా విజయవంతం చేయాలన్నారు.తెలుగు దేశానికి 30 యేండ్ల పాటు దిశా,దశ నిర్దేశించే నాయకుడు మన నారా లోకేషేనన్నారు రాష్ట్ర యువతకు ప్రాధాన్యత నిస్తూ రాయలసీమకు తలమానికంగా కడప మహానాడు నిలవబోతోందనన్నారు నియోజకవర్గంలోని నాయకులంతా ఒక్కటే,నని ఎవరికి ఎటువంటి విబేధాలు లేవని అంతా పార్టీ ఆదేశాల మేరకు పనిచేసే వారమేనన్నారు ఇలాంటి మహానాడు ప్రతి సారి మనకు వచ్చే మహానాడు కాదని జీవితంలో ఒకేసారి వచ్చే మహానాడనన్నారు రేపు,ఎల్లుండి మహానాడులో ఇచ్చే తీర్మానాలు రాయలసీమ అభిరుద్దికి వరం కాబోతుందన్నారు సీమలో అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టుల పై చర్చ జరగాలన్నారు అన్నమయ్య డ్యాం,మునిసిపాలిటీ,జిల్లా కేంద్రం,మెడికల్ కాలేజి సమస్యలను చర్చించేలా,ప్రతి ఒక్క నాయకుడు 10 వేల మందిని తీసుకు రావడమే లక్షంగా పెట్టుకుని ఈ మహానాడును కనివిని ఎరుగని రీతిలో విజవంతం చేయాలన్నారు మేడా కుటుంబ వ్యక్తిగా ఈ మహానాడును కనివిని ఎరుగని రీతిలో విజయవంతం చేసి నా చాటుతానన్నారు
