కమిషనర్ నీలం
ఏపీలో స్థానిక సంస్థల
ఎన్నికలను నాలుగు దశలలో నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని వెల్లడించారు.
( నవ్యాంధ్ర న్యూస్ )
అమరావతిలో మంగళవారం ఎస్ఈసీ నీలం సాహ్ని మాట్లాడుతూ ఈవీఎంలతో ఎన్నికల నిర్వహణ పైప్రభుత్వంతో సంప్రదిస్తామన్నారు.
ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్
2025 అక్టోబర్ 15 లోగా వార్డుల పునర్విభజన, రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేయాలని
అక్టోబర్ 16 నుంచి నవంబర్ 15లోగా వార్డుల వారీగా ఓటర్ల జాబితాను సిద్ధం చేసి, ప్రచురించాలన్నారు
నవంబర్ 1 నుంచి 15వ తేదీలోగా ఎన్నికల అధికారుల నియామకం పూర్తిచేయాలని
నవంబర్ 16 నుంచి 30లోగా పోలింగ్ కేంద్రాలు ఖరారు, ఈవీఎంలు సిద్ధం చేసి సేకరణ పూర్తి చేయాలన్నారు
డిసెంబర్ 15 లోపు రిజర్వేషన్లు ఖరారు చేయాలని డిసెంబర్ చివరి వారంలో రాజకీయ పార్టీలతో సమావేశాలు నిర్వహించాలన్నారు
2026 జనవరిలో ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసి అదే నెలలో ఫలితాలు ప్రకటింస్తామన్నారు

