అమరావతి ( నవ్యాంధ్ర న్యూస్ ) ఆంధ్రప్రదేశ్ లోని పేదలకు మంత్రి నారాయణ శుభవార్త చెప్పారు ఎంత ఖర్చయినా మహిళలకు టిడ్కో ఇళ్లు ఇవ్వాలని చంద్రబాబు ఆదేశించారన్నారు.ఈ దసరా నాటికి పేదలకు టిడ్కో ఇళ్లను అందిస్తామని మంత్రి నారాయణ పేర్కొన్నారు. టిడ్కో ఇళ్లు పూర్తి చేయాలంటే రూ.7 వేల కోట్లు కావాలన్నారు. గత ప్రభుత్వ హయాంలో అప్పులు చేసి వాటిని పక్కదారి పట్టించారు. 2014–19 మధ్య ప్రతిపాదించిన 7లక్షల టిడ్కో ఇళ్లు అవి వైసీపీ హయాంలో ఆగిపోయాయని
ఆయన స్పష్టం చేశారు.
