సత్యసాయి జిల్లా పోలీసుల వైఫల్యం మరోసారి బయటపడింది. కుంటిమద్ది హెలిప్యాడ్లో జరిగిన ఘటనలో రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిపై కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. ఈ కేసులో ప్రకాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తున్నామంటూ సికేపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీధర్.. తోపుదుర్తి ఇంటికి వెళ్లి సెర్చ్ చేస్తున్నట్టు హడావుడి చేశారు. అయితే తోపుదుర్తి అజ్ఞాతంలో ఉన్నారని..
శ్రీ సత్యసాయి జిల్లా: రాప్తాడు మాజీ ఎంఎల్ఏ (Ex MLA) తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి (Thopudurthi Prakash Reddy)ని అరెస్ట్ చేసే విషయంలో అలసత్వంపై డీజీపీ కార్యాలయం సీరియస్ (DGP Office Serious) అయింది. అతనిని అరెస్ట్ చేయడంలో అలసత్వం ప్రదర్శించిన అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై నివేదిక ఇవ్వాలంటూ శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీని డీజీపీ కార్యాలయం కోరింది. 20 రోజులుగా ప్రకాష్ రెడ్డి పోలీసుల కళ్లుగప్పి తప్పించుకోవడం వెనుక ఓ డీఎస్పీ, సీఐ ప్రమేయం ఉందంటూ ఉన్నతాధికారులకు శ్రీ సత్యసాయి జిల్లా పోలీసులు సమాచారం అందించారు. దీంతో తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి ఆచూకీ కోసం పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. విజయవాడ, హైదరాబాద్, బెంగళూరుకు ప్రత్యేక బృందాలు బయలుదేరి వెళ్లాయి.