భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేసిన నాగిరెడ్డి పల్లి మాజీ సర్పంచ్ జంబు సూర్యనారాయణ.
కడప జిల్లా ఏప్రిల్ 11..
(నవ్యంధ్ర న్యూస్ )
నందలూరు నారెడ్డిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని నారాయణ రాజుపేట గ్రామంలో సీతారాముల కళ్యాణ వేడుక ఘనంగా నిర్వహించారు.
నారాయణరాజుపేటలో వెలసియున్న సీతారాముల ఆలయ ప్రాంగణంలో స్వామివారి కల్యాణ వేడుక అంగరంగ వైభవంగా నిర్వహించారు. కళ్యాణ వేడుకలో గ్రామస్తులతో పాటు మాజీ సర్పంచ్ జంబు సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా భక్తులకు నాగిరెడ్డిపల్లి మేజర్ గ్రామపంచాయతీ మాజీ సర్పంచ్ జంబు సూర్యనారాయణ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు నాయన పల్లి వెంకటసుబ్బయ్,
శశికుమార్,కానకుర్తి వెంకటయ్య,సిరిసల నాగేంద్ర.మస్తాన్ రాయల్ ఉమ్మాది శివకుమార్. ఎముక దుర్గయ్య,
బద్రి రమేష్ శ్రీనివాసులు గ్రామస్తులు పాల్గొన్నారు.

