కడప జిల్లా ఫిబ్రవరి 23
(,నవ్యంధ్ర న్యూస్ )
రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న
ఇంటర్మీడియట్ పరీక్షలు కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ మూడుకేంద్రాలు కాకతీయ,నలంద, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ పరీక్షలుప్రారంభ
మైయ్యాయి.
ఈ పరీక్షలు ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించాబడుతాయి.
ఈపరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు సమయ
పాలన పాటించాలని అధికారులుసూచించారు.ఒక్క నిమిషం
ఆలస్యమైనా
అనుమతించబోమని ఇప్పటికే స్పష్టం చేశారు.
పరీక్షా కేంద్రాలలో విద్యార్ధుల
హాల్ టికెట్ లను పోలీసులు పరిశీలించి అనుమతిస్తున్నారు.
పరీక్షా కేంద్రాలలో అక్రమాలు చోటు చేసుకోకుండా నిఘా ఉంచేందుకు ఫ్లయింగ్ స్క్వాడ్ , సిట్టింగ్ స్క్వాడ్ పరీక్షా కేంద్రాలు వద్ద తనిఖీలు చేస్తున్నారు.
ఎండల తీవ్రత దృష్ట్యా , విద్యార్ధుల కోసం పరీక్షా కేంద్రాల వద్ద తాగునీరు , ప్రాథమిక వైద్య
సదుపాయాలను
అధికారులు ఏర్పాటు చేశారు.

