అన్నమయ్య జిల్లా డిసెంబర్ 30
(నవ్యంధ్ర న్యూస్ )
రాజంపేట పట్టణ వాసులకు సుపరిచితులు అయిన దివంగత పాండు రంగయ్య తనయుడు, విశ్రాంత ఉపాధ్యాయులు మెంటా సత్యనారాయణ (70) సోమవారం రాత్రి మృతి చెందారు. సత్యనారాయణ ఇటీవల అనారోగ్యం భారిన పడటంతో కుటుంబ సభ్యులు నెల్లూరు బొల్లినేని హాస్పిటల్ లో వైద్యం అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో సత్యనారాయణ ఆరోగ్యం విషమించి మృతి చెందారు. సత్యనారాయణకు భార్య, ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు.

