అన్నమయ్య జిల్లా డిసెంబర్ 12
(నవ్యంధ్ర న్యూస్ )
జిల్లా కేంద్రంగా రాజంపేటను ప్రకటించాలంటూ భవన నిర్మాణ కార్మికులు హమాలి కూడలిలో నిరసనకు చేపట్టారు.
ఈ సందర్బంగా భవన నిర్మాణ కార్మికులు మాట్లాడుతూ వేల మందికి ఉపాథి చూపిస్తున్న రాజంపేట ప్రాంతాన్ని ప్రభుత్వం జిల్లా కేంద్రం చేసి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
కార్మిక సోదరులు జిల్లాకేంద్ర ఉద్యమానికి జెఎసిఇచ్చేపిలుపులో పాల్గొని ఉధృతం చేసి జిల్లా కేంద్రంగా
రాజంపేటను
సాధించుకుంటామన్నారుపట్టణంలోని హమాలి కూడలి వద్ద జేఎసి ఆధ్వర్యంలో నిర్వహించిన
ఈ కార్యక్రమంలో రాజంపేట జిల్లా కేంద్రం సాధనసమితి జేఎసి
సభ్యులు అబ్బూరి ప్రభాకర్ నాయుడు,పూల భాస్కర్,మండెం
అబూబాకర్,రాజశేఖర్ నాయక్,ఇడిమడకల కుమార్ ,సికిందర్, తదితరులు పాల్గొన్నారు.

