టీడీపీ ఇంచార్జ్ చమర్తి
అన్నమయ్య జిల్లా డిసెంబర్ 08
(నవ్యంధ్ర న్యూస్).
రాజంపేట తెలుగుదేశం కార్యలయంలో సోమవారం తెలుగుదేశం నియోజకవర్గ ఇంచార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు జిల్లా సాధన పై నాయకులతో మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్బంగా చమర్తి మాట్లాడుతూ జేఏసీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్ర సాధనకు ముందుకు వెళ్తామని రాజంపేట జిల్లా అయ్యేవరకు విశ్రమించేదే లేదన్నారు. న్యాయపరంగా జిల్లా కేంద్రంగా రాజంపేటకు అన్ని అర్హతలు ఉన్నాయని ప్రతి ఒక్కరూ తమ నినాదాన్ని
ప్రభుత్వానికి
వినిపించాలన్నారు.
ప్రతి ఇంటి నుండి రాజంపేట జిల్లా కేంద్రానికి మద్దతు ఇవ్వాలని.
ప్రాంతం కంటే భవిష్యత్ తరాల తరాల బాగు కోసం కలిసి నడవాలన్నారు.
గతంలో చేసిన కుట్రలను ఈసారి భగ్నం చేసి. స్వార్థ రాజకీయాలను పక్కన పెట్టి ప్రజల ఆకాంక్షలను ముందుకు తీసుకెళ్తామన్నారు
ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు తరిగోపుల లక్ష్మీనారాయణ,సంభావు వెంకటరమణ,ప్రభాకర్,
రవీంద్ర,పూలభాస్కర్,
వర్ధిబోయిన సుధాకర్ బాబు,మేడికొండ రవికుమార్ నాయుడు,
దగ్గుబాటి సుబ్రహ్మణ్యం నాయుడు,సంజీవరావు,తలిశెట్టి రమేష్, నాయక్,బాసినేని
వెంకటేశ్వర్లునాయుడు,
టీ సంజీవరావు, నాగినేని నాగేశ్వరరావునాయుడు,తల్లపునేని శ్రీనివాసులు నాయుడు,గల్లాసుధాకర్,పబ్లిశెట్టి సుబ్రమణ్యం, కోవూరు సుబ్రహ్మణ్యం నాయుడు,పరుశురాం, టిఎన్ఎస్ఎఫ్ శివ,
రాంనగర్ నరసింహ
తదితరులు పాల్గొన్నారు.

