అన్నమయ్య జిల్లా డిసెంబర్ 08
(నవ్యంధ్ర న్యూస్ )
రాజంపేట జిల్లా కేంద్ర సాధన సమితి ఆధ్వర్యంలో డిగ్రీ, ఇంటర్మీడియట్ విద్యార్థిని,విద్యార్థులు జిల్లా కేంద్రంగా రాజంపేట ను ప్రకటించాలని డిగ్రీ కళాశాల నుంచి నినాదాలు చేస్తూ నిర్వహించిన ర్యాలీలో స్వచ్ఛందంగా ప్రజలు జేఏసీ నాయకులు పాల్గొని సబ్ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహిస్తున్న ప్రజావేదిక,
(గ్రీవెన్స్ సెల్ ) (పీజేఆర్) లో వినతి పత్రం సమర్పించారు.
ఈ సందర్బంగా విద్యార్థిని,విద్యార్థులు,
జేఎసి నాయకులు
జిల్లా కేంద్రం గా
రాజంపేటను ప్రజాటించేలా ప్రజావేదికలో సమర్పించిన వినతిపత్రంతో ఉన్నతాదికారులు,
కూటమి ప్రభుత్వ పాలకులకు చేర్చి జిల్లా కేంద్రంగా రాజంపేటను ప్రకటించెందుకు మీరు భాగస్వానులు కావాలని సబ్ కలెక్టర్ భావనను కోరారు.
ఈ కార్యక్రమంలో జేఏసీ సభ్యులు పూల భాస్కర్, ప్రభాకర్ నాయుడు,
చిట్వేల్ రవి కుమార్, వర్ధిబోయిన సుధాకర్ బాబు,చల్లా సుధాకర్, శ్రీనివాసులు నాయుడు, హరీశ్,అలీ,ఈశ్వరయ్య, రాజశేఖర్ నాయక్, డిఎస్ రావు, సికిందర్, విద్యార్థి సంఘ
నాయకులు,విద్యార్థి, విద్యార్థినిలు పాల్గొన్నారు..

