తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా బాధ్యతలు చేపట్టిన అనిల్ కుమార్ సింఘాల్

Spread the love

టీటీడీ ఈవోగా రెండోసారి అవకాశం దక్కడం మరింత బాధ్యతను పెంచింది

తిరుపతి జిల్లా సెప్టెంబర్ 10

( నవ్యాంధ్ర న్యూస్ )

తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా బుధవారం తిరుమల శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ పూర్వపు ఈవో శ్యామలరావు నుండి బాధ్యతలు స్వీకరించారు.
అనంతరం శ్రీవారి ఆలయంలో టీటీడీ బోర్డు సభ్యుల సెక్రటరీ ఎక్స్ ఆఫీసియో గా కూడా ప్రమాణం చేశారు. వీరితో టీటీడీ అదనపు ఈఓ వెంకయ్య చౌదరి ప్రమాణం చేయించారు.
స్వామివారి దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు నూతన
ఈఓకు వేదాశీర్వచనం చేశారు.అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి ఈవోకు శ్రీవారి ప్రసాదాలు, చిత్రపటం అందజేశారు.
ఈ సందర్బంగా ఈవో ఆలయం వద్ధ మీడియాతో మాట్లాడుతూ టీటీడీ ఈవోగా రెండోసారి బాధ్యతలు స్వీకరించడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాన్నారు.
ఈ అవకాశాన్ని కల్పించినందుకు ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడుకు ధన్యవాదాలు తెలియజేశారు.
మొదటిసారి మే 2017 నుంచి అక్టోబర్ 2020 వరకు – మూడు సంవత్సరాలు నాలుగు నెలలు సేవలందించే అవకాశంవచ్చిందన్నారు. గత సంవత్సరం నుండి లడ్డు, అన్నప్రసాదాల క్వాలిటీ మెరుగు
పడటంతో భక్తులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారన్నారు
భక్తుల నుండి ఫీడ్ బ్యాక్ సేకరించి సేవల
నాణ్యతను పెంచేందుకు నిర్ణయాలు తీసుకుంటామన్నారు. ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడుని కలిసి సలహాలు తీసుకున్నాన్నారు
దేవాలయ పవిత్రతను కాపాడేందుకు,సాధారణ భక్తులకు న్యాయం చేసేందుకు టెక్నాలజీ వినియోగం పై దృష్టి సరిస్తామన్నారు. ఇతర రాష్ట్రాల రాజధానులలో వెంకటేశ్వరస్వామి దేవాలయాలు నిర్మించే ఆలోచన చేస్తున్నామన్నారు. టీటీడీ అధికారులు ఎంతో చిత్తశుద్ధితో రాత్రింబవళ్లు కృషి చేసి ఉత్సవాలను విజయవంతం చేస్తున్నారన్నారు శ్రీవారి సేవకుల సేవలు మరింత విస్తరించే దిశగా ఆలోచన చేస్తున్నామనీ,
ప్రపంచమంతా ఉన్న భక్తుల సూచనలు స్వీకరించి టీటీడీ సేవలు మెరుగుపరుస్తామన్నారు
ఈ కార్యక్రమంలో టీటీడీ జేఈవో వీరబ్రహ్మం, సీవీఎస్వో శ్రీ మురళీకృష్ణ, డిప్యూటీ ఈవోలు లోకనాథం,భాస్కర్, శ్రీమతి ప్రశాంతి, సోమన్నారాయణ,ఇతర అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

టీటీడీ చైర్మన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన టీటీడీ ఈవో

టీటీడీ చైర్మన్ బీ.ఆర్.నాయుడును టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ నూతనంగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా తిరుమలలోని టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా ఈవోను చైర్మన్ శాలువాతో సత్కరించారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు భాను ప్రకాష్ రెడ్డి,నరేష్, తదితరులు పాల్గొన్నారు.

అనంతరం టీటీడీ ఉద్యోగులకు కృతజ్ఞతలు తెలిపిన పూర్వపు ఈవో

టీటీడీ ఈవోగా పని చేసి బదిలీ పై వెళ్లిన టీటీడీ పూర్వపు ఈవో జె.శ్యామలరావు తనకు విధి నిర్వహణలో సహకరించిన టీటీడీ అధికారులు,ఉద్యోగులకు కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ 14 నెలల కాలంలో తిరుమలలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చామన్నారు. వచ్చే 25 ఏళ్ల పాటు స్వామివారి అన్నప్రసాదం, లడ్డూ ప్రసాదం నాణ్యతలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *