చిత్తూర జిల్లా జూన్ 17
( నవ్యాంధ్ర న్యూస్ )
రేణిగుంట ఎయిర్పోర్ట్కు తిరుమల శ్రీవారి పేరును పెట్టాలని ప్రతిపాదించినట్లు టీటీడీ తెలిపింది. ఈ మేరకు ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎ ఎ ఐ)కి లేఖ రాయనున్నామని వెల్లడించింది. మంగళవారం తిరుమలలో నిర్వహించిన టీటీడీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంది. బెంగళూరులో శ్రీవారి ఆలయం నిర్మించనున్నట్లు పేర్కొంది.
ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అభ్యర్థన మేరకు
ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.