నిజాముద్దీన్ ఏ.పి.సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌ రైలు నిలుపుదల ఎర్పాటును జెండా ఊపి ప్రారంభించిన జిల్లా మంత్రి

Spread the love

నరేంద్ర మోడీ నాయకత్వంలో దక్షిణ మధ్య రైల్వే అభివృద్ధి పథంలో పరుగులు

అన్నమయ్య జిల్లా జూన్ 11
( నవ్యాంధ్ర న్యూస్ )

రాజంపేట రైల్వే స్టేషన్ లో తిరుపతి నుంచి హజరత్ నిజాముద్దీన్‌కు వెళ్లే 12707 ఏ.పి. సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ రైలు నిలుపుదల ఏర్పాటును ముఖ్యఅతిథిగా పాల్గొన్న రవాణా,యువజన క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి,బిజెపి నాయకులు, తెలుగుదేశం పార్లమెంట్ అధ్యక్షులు చమర్తి జగన్మోహన్ రాజులు జెండా ఊపి ప్రారంభించారు
ఈ సందర్భంగా రవాణా, యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ సంపర్ క్రాంతి ఎక్స్ప్రెస్ రైలు నిలుపుదల ఏర్పాటును అందుబాటులోకి తీసుకురావడంతో స్థానిక ప్రజలకు పెద్ద ఊరట లభించిందన్నారు కేంద్రంలో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత దక్షిణ మధ్య రైల్వే శరవేగంగా అభివృద్ధి వైపు పరుగులు తీస్తుందన్నారు గుంటూరు డిఆర్ఎం ప్రస్తుత గుంతకల్ ఇంచార్జ్ సుదీష్న సింగ్ మాట్లాడుతూ స్థానిక రైల్వేస్టేషన్ను రెండు ఫేసులలో పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయడానికి దక్షిణ మధ్య రైల్వే సన్నాహాలు చేస్తుందని ఇప్పటికే మొదటి ఫేస్ పనులు పూర్తి కావస్తున్నాయని రెండో ఫేస్ లో కూడా మిగిలిన పనులు పూర్తి చేస్తామన్నారు. బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నంద్యాల జిల్లా ఇంచార్జ్ పోతుగుంట రమేష్ నాయుడు మాట్లాడుతూ స్థానిక ప్రజల ఎన్నో సంవత్సరాల కళ అని నిజాముద్దీన్ స్టాపింగ్ వల్ల రాజంపేట కోడూరు చుట్టుప్రక్కల ప్రజలకు ఇదంతా ఉపయోగమన్నారు ఒకటో నెంబర్ ప్లాట్ ఫామ్ నుండి రెండో నెంబర్ ప్లాట్ఫామ్ కు ఫుట్ ఓవర్ బ్రిడ్జి మీద సీనియర్ సిటిజన్స్ ఎక్కి దిగాలంటే చాలా ఇబ్బందులు పడుతున్నారని డిఆర్ఎం దృష్టికి తీసుకెళ్లారు డిఆర్ఎం వెంటనే స్పందించి రెండో ఫేస్ లో లిఫ్ట్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం జిల్లా మంత్రి రాంప్రసాద్ రెడ్డి, శాసనమండలి డిప్యూటీ చైర్ పర్సన్ మయాన జకియా కణం, డిఆర్ఎం సుదీష్న సింగ్, జగన్ మోహన్ రాజు,పోతు గుంట రమేష్ నాయుడు,సాయి లోకేష్,నాగోతు రమేష్ నాయుడు తదితరులు జండా ఊపి రైలును ప్రారంభించారు ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు కూటమి నాయకులు,తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *