జర్నలిస్టుల ఫీజు రాయితీలపై స్పందించిన ఐ& పి ఆర్ డైరెక్టర్ కు

Spread the love

జర్నలిస్టుల ఫీజు రాయితీకి వెంటనే చర్యలు తీసుకున్న I & PR డైరెక్టర్ కు అభినందనలు సెక్రటేరియట్ జర్నలిస్ట్ అసోసియేషన్ ప్రతినిధులు
సెక్రటేరియట్ జర్నలిస్ట్ అసోసియేషన్ ప్రతినిధులు ఐ.అండ్ పి.ఆర్. డైరెక్టర్ హిమాంశు శుక్లా IAS ని కలిసి, జర్నలిస్టుల కుటుంబాలు ఎదుర్కొంటున్న ఆర్థిక భారాన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ విద్యా సంస్థల్లో జర్నలిస్టుల పిల్లలకు ఫీజు సడలింపు కల్పించాలంటూ విజ్ఞాపన పత్రం సమర్పించారు.
ఈ విజ్ఞప్తిపై వెంటనే స్పందించిన డైరెక్టర్ హిమాంశు శుక్లా అన్ని జిల్లా కలెక్టర్లతో చరవాణి ద్వారా మాట్లాడి, ఈ అంశంపై అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ మేరకు జిల్లా కలెక్టర్ లు సానుకూలంగా స్పందిస్తూ, “జర్నలిస్టులకు ఎప్పుడైనా సహాయం అందించడానికి సిద్ధంగా ఉన్నామని హామీ ఇస్తూ
ఒకటి,రెండు రోజులలో సంబంధిత ఆదేశాలు జారీ చేస్తామని డైరెక్టర్ హిమాంశు శుక్లాకు తెలిపారు.
జర్నలిస్టుల పిల్లలకు ఫీజు రాయితీ ఇచ్చేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఏవైన ఇబ్బందులు ఎదురైతే నేరుగా జిల్లా కలెక్టర్ లను సంప్రదించి పరిష్కరించుకోవాలని డైరెక్టర్ శ్రీ హిమాంశు శుక్లా తెలిపారు..
జర్నలిస్టుల పిల్లల విద్య కోసం తీసుకుంటున్న ఈ చొరవకు సెక్రటేరియట్ జర్నలిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు రమేష్ ప్రతినిదులు,జర్నలిస్టుల సంఘానాయకులు ఐ.అండ్ పి.ఆర్ డైరెక్టర్ హిమాంశు శుక్లాకు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ అంశంపై సమాచార శాఖా మంత్రి కొలుసు పార్థసారధి సానుకూలంగా స్పందించడం అభినదనీయం..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *