రాజంపేట ( నవ్యాంధ్ర న్యూస్ )
కడపలో నిర్వహిస్తున్న మహానాడు 3వ రోజు గురువారం భారీ బహిరంగ సభలో నవ్యాంధ్ర నిర్మాత, భవిష్యత్ ఆంధ్ర ప్రదేశ్ ఆశా కిరణం, విజన్ 2047 సారథి , ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కలిసి రాజంపేట పార్లమెంట్ టిడిపి రథసారథి,,నియోజకవర్గ ఇన్చార్జ్ చమర్తి జగన్మోహన్ రాజు సభా వేదిక పై విజయ చిహ్నం కార్యక్రమంలో పాల్గొన్నారు. మూడు రోజులు నిర్వహించిన మహానాడు తెలుగు తమ్ముళ్ల ఆదరభిమానాలతో విజయవంతం కావడం, చమర్తి ఆధ్వర్యంలో నియోజకవర్గ వ్యాప్తంగా వేలాదిమంది నాయకులు కార్యకర్తలు, అభిమానులు,,ప్రజలు, మహిళలు ఉత్సాహంగా పాల్గొని మహానాడు సూపర్ సక్సెస్ కావడం పట్ల చమర్తి జగన్మోహన్ రాజు హర్షం వ్యక్తం చేశారు.