రేషన్ గౌడన్, వాహనాల పై ప్రధాని మోడీ ఫోటో ఏర్పాటు ముద్రించాలి

Spread the love

జూన్ ఒకటి నుండి ప్రతి రేషన్ గౌడన్, వాహనాల పై భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫోటోను ముద్రించాలని బీజేపీ ఓబీసీ నాయకులు పట్టుపోగుల ఆదినారాయణ అన్నారు.పేదలకిచ్చే బియ్యం
ప్రదానమంత్రి నరేంద్రమోదీ కరోనా కష్టకాలం నుండి పూర్తి ఉచితంగా దేశవ్యాప్తంగా తెల్లరేషన్ కార్డు కలిగిన నిరుపేదలు మధ్యతరగతి,కుటుంబాలకు అర్హులందరకీ 5కేజీల చొప్పున ఇస్తున్నారని అన్నారు. ఈ రేషన్ బియ్యం గత వైసీపీ ప్రభుత్వంలో పక్కదారి పట్టాయని ఆరోపించారు. వాటిని నివారించడానికి ఈకెవైసీ అప్ డేట్ చేసి బియ్యాన్ని అర్హులై వారికే అందజేసేలా చర్యలు తీసుకొంటుందన్నారు.ఇప్పటివరకు అప్ డేట్ చేయించుకోలేనివారు వివరాల ప్రకారం రేషన్ డీలర్ వద్ద, వాహానం వద్ద ఈపాస్ యంత్రంలో వేలిముద్రవేసి కేవైసీ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. దివ్యాంగులకు,65ఏళ్లు దాటినవారికి డోర్ డెలివరీ చేస్తారన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *