కడప అన్నమయ్య ఉమ్మడి జిల్లాలలో మహానాడు పండుగ జరగడం తెలుగు తమ్ముళ్ల అదృష్టం మాజీ మంత్రివర్యులు మరియు ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు.
జగన్ మోహన్ రాజు ఆధ్వర్యంలో రాజంపేటలో అన్ని సమస్యలకు పరిష్కారం చూపిస్తాం,,,
మహానాడులో రాజంపేట తెలుగు తమ్ముళ్లు సత్తా చూపాలని పిలుపునిచ్చిన
రాష్ట్ర మంత్రి వర్యులు నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు నియోజకవర్గ ఇన్చార్జ్ అన్నమయ్య జిల్లా అధ్యక్షులు చమర్తి.
అన్నమయ్య జిల్లా ( నవ్యాంధ్ర న్యూస్ ) రాజంపేట AB చంద్రరెడ్డి గార్డెన్స్ లో ఆదివారం తెలుగుదేశం నియోజకవర్గ ఇంచార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు అధ్యకతన నిర్వహించిన టీడీపీ నాయకుల సమావేశంలో నిమ్మల రామనాయుడు,శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు,అబ్జర్వర్ దుర్గాప్రసాద్ లు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ 27,28,29 మూడురోజులు నిర్వహించే మహానాడులో నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరు పాల్గొని కనీ విని ఎరుగని రీతిలో జయప్రదం చేయాలన్నారు నియోజకవర్గ ఇన్చార్జ్ అన్నమయ్య జిల్లా అధ్యక్షులు చమర్తి జగన్మోహన్ రాజు మాట్లాడుతూ నియోజకవర్గం నుంచి 1000 వాహనాలలో మహానాడుకు టిడిపి నాయకులు,కార్యకర్తలు, అభిమానులు,మహిళలు,ప్రజలను భారీగా తరలించేందుకు సిద్ధమయ్యామన్నారు.నియోజకవర్గం నుంచి మహానాడుకు భారీ ఎత్తున జనసమీకరణ చేసి తమ సత్తా చాటుతామన్నారు నియోజకవర్గంలోని ఆరు మండలాల అధ్యక్షులు ఆరు మండలాల నాయకులు కార్యకర్తలు, అభిమానులు మహానాడు పండుగలో పాల్గొనేలా చూడాలన్నారు నియోజకవర్గ అభిరుద్దికి అన్ని విధాలా కృషి చేస్తామన్నారు
వైకాపా పాలనలో రాష్ట్రంలో విధ్వంసం జరిగిందని పించా ప్రాజెక్టు దెబ్బతిన్న విషయం అధికారులు చెప్పిన అన్నమయ్య ప్రాజెక్టు గేట్లు తెరవలేదు దీనికి కారణం నాటి పాలకులకు సంబంధించిన వాహనాలు నదిలో ఉండటం వాటిని కాపాడుకోవడానికి అన్నమయ్య గేట్లను ఎత్తలేదన్నారు దాంతో పదుల సంఖ్యలో ప్రజలు చనిపోయారు వందలాది మూగజీవాలు వరద నీటిలో కొట్టుకుపోయాయి ఇంత జరిగిన నాటి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ నుంచి అడుగు బయట పెట్టలేదు కానీ నాడు ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు బాధితులను ఓదార్చడానికి బురద నీటిలో పర్యటించి బాధితుల కష్టాలు తెలుసుకున్నారు అన్నమయ్య ప్రాజెక్టు నిర్మాణానికి చర్యలు తీసుకుంటాం ఆ ప్రాజెక్టు నిర్మాణానికి తయారుచేసిన ప్రాజెక్టు రిపోర్టును పరిశీలించి వరద నీటి అంచనా మేరకు ప్రాజెక్టు నిర్మాణానికి చర్యలు చేపట్టడం జరుగుతుందని రాష్ట్ర మంత్రివర్యులు నిమ్మల రామానాయుడు తెలియజేశారు.
రాజంపేట నియోజకవర్గ అభివృద్ధికి అన్ని విధాల సహకరిస్తామని, నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ కార్యకర్తలకు వెన్నుదన్నుగా ఉన్న జగన్మోహన్ రాజు ఆధ్వర్యంలో రాజంపేట అభివృద్ధి పై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామని వారు తెలియజేశారు. కడప జిల్లాలో మహానాడు జరగడం తో ఇక్కడి తెలుగు తమ్ముళ్లకు చాలా గౌరవంగా ఉంటుందని, ఆ గౌరవాన్ని నిలబెట్టుకునేలా ప్రతి కార్యకర్త మహానాడులో పాల్గొనాలని జయప్రదం చేయాలని మాజీ మంత్రివర్యులు చిలకలూరిపేట ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు పిలుపునిచ్చారు,
ఈ కార్యక్రమంలో ఆరు మండలాల టిడిపి అధ్యక్షులు, క్లస్టర్ ఇంచార్జిలు, యూనిట్ ఇన్చార్జులు, బూత్ ఇన్చార్జులు, టిడిపి ముఖ్య నాయకులు, కార్యకర్తలు, పాల్గొన్నారు