ప్రభుత్వాలు మారిన ఆగని సహజ వనరుల ఇసుక ఎర్రచందనం మట్టి దోపిడీ అన్నమయ్య జిల్లా ( నవ్యాంధ్ర న్యూస్ ) రాజంపేట బీజేపీ కార్యాలయంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నంద్యాల జిల్లా ఇన్చార్జి పోతుగుంట రమేష్ నాయుడు ఎర్రచందనం, ఇసుక,మట్టి దోపిడీ పై మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పోతుకుంట రమేష్ నాయుడు మాట్లాడుతూ ప్రభుత్వాలు మారిన సహజ వనరుల దోపిడీలో ఎలాంటి మార్పు లేదు గత ప్రభుత్వంలో ప్రజలకు ఇసుక మట్టి అందుబాటులో ఉండేది కాదు ఉన్న కూడా అధిక ధరకు అమ్మేవారు కానీ కూటమి ప్రవర్తన వచ్చిన తర్వాత ఇసుకను ఉచిత చేయడం ప్రజలకు ఇది ఎంతో ఉపయోగకరం కాకపోతే మన మండలపరిధిలోని బాలరాజుపల్లి రీచ్ నుంచి 24గంటలు నిబంధనలకు విరుద్ధంగా పదుల సంఖ్యలో పెద్ద టిప్పర్లు బెంగళూరుకు యదేచ్చగా ఇసుక తరలిపోతున్న అధికారులు కళ్ళు మూసుకొని వ్యవహరిస్తున్నారు అలాగే మట్టి కూడా దోచుకుపోతున్నారు సహజ వనరులు ఇలా దోచుకుపోవడం వల్ల రాబోవు తరాలకు చాలా ఇబ్బంది కడుతుంది ఇది గ్రీన్ ట్రిబ్యునల్ నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు వీటన్నిటి పైన కూడా పర్యావరణ శాఖకు మరియు గ్రీన్ ట్రిబ్యునల్ కు త్వరలో బిజెపి బృందం ఢిల్లీకి వెళ్లి ఫిర్యాదు చేయబోతున్నది అలాగే మన ప్రాంతంలో ఎర్రచందనం దోపిడీ కూడా ఎరేచ్గా జరుగుతున్నది దానికి నిదర్శనం ఈమధ్య ఒంటిమిట్ట దగ్గర దొరికిన ఎర్రచందనమే ఎక్కడ ఎర్రచందనం దొరికిన ఒక పాత లారీలో కొన్ని ముద్దులు పెట్టి ఇవి అన్ని కోట్లు ఎన్ని కోట్లు అని విలువ చేసింది పట్టుకున్నామని చెప్పడమే తప్ప ఏ ఒక్కరి పైన బడా స్మగ్లర్ పైన చర్య తీసుకున్న పాపన్న పోలేదు ప్రభుత్వాలు మారుతున్నాయి ఎర్రచందనం స్మగ్లర్ యదయచ్చుగా ఎర్రచందనాన్ని తరలిస్తూనే ఉన్నారు జిల్లా అధికారులందరికి కూడా బిజెపి చేసే విజ్ఞప్తి డిమాండ్ ఏమంటే ప్రకృతి వనరులను కాపాడాల్సిన బాధ్యత ప్రజలతో పాటు మీ పైన అధికంగా ఉన్నది కావున మీరు చూసి చూడనట్టు అధికార పార్టీతో లాలుచబడి వ్యవహరిస్తే భవిష్యత్తు తరాలకు మీరు అన్యాయం ద్రోహం చేసిన వారుగా మిగులుతారు కాబట్టి ఇప్పటికైనా బాలరాజు పల్లి ఏట్లోయించి రాత్రులు పొగలు అధిక లోడ్లతో వెళ్తున్న లారీలను ఆపగలరని ప్రకృతిని కాపాడగలరని ఆశిస్తున్నాం. ఈ కార్యక్రమంలో బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి పట్టుపోగుల ఆదినారాయణ పట్టణ అధ్యక్షులు వివి రమణ బిజెపి రాష్ట్ర నాయకులు హిమగిరి యాదవ్ తదితరులు పాల్గొన్నారు