గస్తీ విధులు పటిష్టం చేయాలి.
పాత నేరస్థుల పై నిఘా ఉంచాలి.
ప్రతి రోజు గ్రామాలు సందర్శించాలని ఆదేశాలు జారీ చేసిన జిల్లా ఎస్పీ శ్రీ.వి.విద్యాసాగర్ నాయుడు
చిన్నమండెం పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ..
అన్నమయ్య జిల్లా రాయచోటి, ( నవ్యాంధ్ర న్యూస్ ) రాత్రి వేళలో గస్తీ విధులు పటిష్టం చేసి నేర నియంత్రణ చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ శ్రీ.వి.విద్యాసాగర్ నాయుడు ఐపీఎస్ గారు పోలీస్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం “చిన్నమండెం” పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్ రిసెప్షన్ కేంద్రంలో రికార్డుల నిర్వహణ, ప్రజా సమస్యలు పరిష్కారాలను తదితర అంశాలను పరిశీలించి మహిళల సమస్యలకు ప్రాధాన్యత, ఇస్తూ పరిష్కార దిశగా చర్యలు చేపట్టాలని సూచించారు. పెండింగ్లో ఉన్న ముఖ్యమైన కేసుల సీడీ ఫైళ్లను పరిశీలించి, వాటి దర్యాప్తు, పురోగతిపై ఆరా తీశారు. రౌడీ షీటర్లు, చెడు నడవడిక కలిగిన వ్యక్తులపై, పాత నేరస్తులపై ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. దొంగతనాలు మరియు ఇతర నేరాలను అరికట్టేందుకు రాత్రి గస్తీ విధులను మరింత పటిష్టంగా నిర్వహించాలన్నారు. పెండింగ్ లో ఉన్న ఎన్.బి.డబ్ల్యు ను త్వ