శ్రీహరి కోట ( నవ్యాంధ్ర న్యూస్ )
ఏపీలో మే 18న ఉ.6:59 గంటలకు శ్రీహరికోటలోని షార్ నుంచి PSLV-C61 XL వాహకనౌక రీశాట్-1B (EOS-09) ఉపగ్రహాన్ని నింగిలోకి తీసుకెళ్లనుంది. ఇది సీ బ్యాండ్ సింథటిక్ అపర్చర్ రాడార్ సాయంతో భూభాగాన్ని, సరిహద్దులను నిశితంగా పరిశీలించనుంది. రీశాట్ సిరీస్లో ఏడవది అయిన 1,710 కేజీలు ఉండే EOS-09 ఉపగ్రహాన్ని 529కి.మీ. ఎత్తులో కక్ష్యలోకి
ఇస్రో ప్రవేశపెట్టనుంది. ఇది రక్షణశాఖకు వెన్నుదన్నుగా
నిలవనుంది.

