కాలికి గాయమైందని వెళ్తే.. ప్రాణం పోయింది
May 12, 2025( నవ్యాంధ్ర న్యూస్ )
కాలికి గాయమైందని వెళ్తే.. ప్రాణం పోయింది
తెలంగాణ : కాలుకు గాయమైందని ఆస్పత్రికి వెళ్లిన యువకుడు ప్రాణాలు పోగొట్టుకున్నాడు. సూర్యాపేట జిల్లా ఎర్కారం గ్రామానికి చెందిన పరమేష్(25) ఈ నెల 5న కుడికాలు పాదానికి రేకు గీసుకొని గాయమైంది. ఓ ప్రైవేటు ఆస్పత్రిలో అతడికి సర్జరీ చేశారు. 9న వైద్యులు అతడి మెదడులో రక్తస్రావమైందని అనడంతో కుటుంబసభ్యులు సర్జరీకి రూ.3 లక్షలు ఇచ్చారు. శనివారం పరమేష్ పరిస్థితి విషమంగా ఉందనడంతో గాంధీకి తరలించారు. అక్కడి వైద్యులు మృతి చెందినట్లు తెలిపారు.

