వీర‌మ‌ర‌ణం పొందిన జవాన్ కు నివాళులర్పించిన జర్నలిస్టులు

Spread the love

రాజంపేట ( నవ్యాంధ్ర న్యూస్ )

పట్టణంలోని రోడ్ల భవనాల అతిథి గృహంలో శనివారం అన్నమయ్య ప్రెస్ క్లబ్ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో 2022 నుంచి 24 వరకు అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వహించిన తేజం రవి ప్రసాద్ ను 24 నూతన కమిటీ అధ్యక్షులు కొండూరు రఘురాం రాజు శాలువాతో ఘనంగా సత్కరించి బాధ్యతలు స్వీకరించారు అనంతరం పాకిస్థాన్ సైన్యం జ‌రిపిన కాల్పులలో వీర‌మ‌ర‌ణం పొందిన జ‌వాన్‌ మురళీ నాయక్ చిత్ర‌ప‌టానికి పాత్రికేయులు పూల‌మాల‌లు వేసి అశ్రునివాళులు అర్పించారు.ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు రఘు రామరాజు మాట్లాడుతూ వీర జవాన్ మురళీనాయక్ ప్రాణాలు కోల్పోవడం తీర‌ని విషాద‌మ‌న్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టు గుండ్రాతి విజయకుమార్, గాడి అశోక్ కుమార్ రెడ్డి, మాడ శ్రీధర్, తుపాకుల సురేష్, కార్తీక్, కర్ణాటమ్ అనిల్ కుమార్, కళ్యాణ్, ప్రధాన కార్యదర్శి పెయ్యల శివ, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *